Tuesday, 18 August 2026
  • Home  
  • సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు
- జనగాం

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు

*సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టీఆర్పీ నాయకులు* ——————————————— జనగామ, ఆగష్టు 18,పున్నమి జిల్లా ప్రతినిధి : *సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టీఆర్పీ నాయకులు* *మా వీరుడి పోరాటం* – *మా జాతి ఆరాటం*! *పాపన్న గౌడ్ చూపిన బాటలో… బీసీల* *రాజ్యాధికారం కోసం టీఆర్పీ పోరాటం.* తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నియోజకవర్గ ఇంచార్జి డా. కల్నల్ మాచర్ల బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని SC, ST, BC, మైనారిటీ ప్రజలు గుర్తుచేసుకోవాలి. ఎవరి ముందు గులాంగిరీ చేయకుండా, ఎవరి పెత్తనానికీ తలవంచకుండా మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన భవిష్యత్తు కోసం ఐక్యంగా, ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడాలి. పాపన్న గౌడ్ పోరాటం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకం. 375 ఏళ్లు గడిచినా ఆయన పేరు చరిత్రలో చెరిగిపోకుండా చిరస్థాయిగా నిలిచిందంటే, అది ఆయన పోరాట పటిమకు, ప్రజల కోసం చేసిన త్యాగాలకు నిదర్శనం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం ఒక యోధుడు మాత్రమే కాకుండా, అణగారిన బహుజన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప ప్రజా నాయకుడని కొనియాడారు. గోల్కొండ కోటపై పాపన్న గౌడ్ సాధించిన ఆధిపత్యం ఆయన ధైర్యసాహసాలకు, పోరాట పటిమకు ప్రతీకగా నిలిచిందన్నారు. జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ మాట్లాడుతూ, కిలాషపురంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గీత కార్మిక కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగి, తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆనాటి సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. తనతో పాటు 12 మంది స్నేహితులను కలుపుకుని ప్రారంభమైన ఉద్యమాన్ని విస్తరించి, కుమ్మరి, మంగలి, సకలి, దూదేకుల తదితర బహుజన వర్గాలను ఏకం చేసి సుమారు 1,200 మంది సైన్యాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ వరంగల్ కోట నుంచి గోల్కొండ వరకు తన ప్రభావాన్ని విస్తరించి, బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. ఆయన చూపిన ధైర్యం, సమానత్వం, స్వాభిమానం, సామాజిక న్యాయం వంటి విలువలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. కిలాషపుర గ్రామ ముద్దుబిడ్డగా చరిత్రలో నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను స్మరించుకుంటూ టీఆర్పీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్లు సీసా శ్రీధర్ గౌడ్, జిట్టబోయిన నరేష్, మైనారిటీ సెల్ అధ్యక్షులు యాకుబ్ పాషా, జిల్లా నాయకులు అంజద్ పాషాతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

*సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టీఆర్పీ నాయకులు*
———————————————
జనగామ, ఆగష్టు 18,పున్నమి జిల్లా ప్రతినిధి :
*సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టీఆర్పీ నాయకులు*
*మా వీరుడి పోరాటం* – *మా జాతి ఆరాటం*!
*పాపన్న గౌడ్ చూపిన బాటలో… బీసీల* *రాజ్యాధికారం కోసం టీఆర్పీ పోరాటం.*
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నియోజకవర్గ ఇంచార్జి డా. కల్నల్ మాచర్ల బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని SC, ST, BC, మైనారిటీ ప్రజలు గుర్తుచేసుకోవాలి. ఎవరి ముందు గులాంగిరీ చేయకుండా, ఎవరి పెత్తనానికీ తలవంచకుండా మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన భవిష్యత్తు కోసం ఐక్యంగా, ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడాలి. పాపన్న గౌడ్ పోరాటం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకం. 375 ఏళ్లు గడిచినా ఆయన పేరు చరిత్రలో చెరిగిపోకుండా చిరస్థాయిగా నిలిచిందంటే, అది ఆయన పోరాట పటిమకు, ప్రజల కోసం చేసిన త్యాగాలకు నిదర్శనం.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం ఒక యోధుడు మాత్రమే కాకుండా, అణగారిన బహుజన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప ప్రజా నాయకుడని కొనియాడారు. గోల్కొండ కోటపై పాపన్న గౌడ్ సాధించిన ఆధిపత్యం ఆయన ధైర్యసాహసాలకు, పోరాట పటిమకు ప్రతీకగా నిలిచిందన్నారు.
జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ మాట్లాడుతూ, కిలాషపురంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గీత కార్మిక కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగి, తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆనాటి సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. తనతో పాటు 12 మంది స్నేహితులను కలుపుకుని ప్రారంభమైన ఉద్యమాన్ని విస్తరించి, కుమ్మరి, మంగలి, సకలి, దూదేకుల తదితర బహుజన వర్గాలను ఏకం చేసి సుమారు 1,200 మంది సైన్యాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
పాపన్న గౌడ్ వరంగల్ కోట నుంచి గోల్కొండ వరకు తన ప్రభావాన్ని విస్తరించి, బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. ఆయన చూపిన ధైర్యం, సమానత్వం, స్వాభిమానం, సామాజిక న్యాయం వంటి విలువలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు.
కిలాషపుర గ్రామ ముద్దుబిడ్డగా చరిత్రలో నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను స్మరించుకుంటూ టీఆర్పీ నాయకులు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్లు సీసా శ్రీధర్ గౌడ్, జిట్టబోయిన నరేష్, మైనారిటీ సెల్ అధ్యక్షులు యాకుబ్ పాషా, జిల్లా నాయకులు అంజద్ పాషాతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.