సైఫన్ ఆక్విడెక్ట్ వద్ద జరుగుతున్న పునరుద్ధరణ పనులను దగ్గరుండి పర్యవేక్షించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి
కాంక్రీట్ పనుల్లో నాణ్యత లోపించడంపై కావలి కాలువ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచన
అధికారుల నిర్లక్ష్యం వల్లే కావలి కాలువపై 12వ కిలోమీటర్ దగ్గర ఉన్న సైఫన్ దాదాపు 25 రోజులుగా దెబ్బతిని నీరు సముద్రంపాలవుతోంది:ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి సైఫన్ దెబ్బతిన్న విషయాన్ని కలెక్టర్, ప్రజాప్రతినిధులు లేదా తమ దృష్టికి తీసుకురావడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు:ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి
సమస్య తెలియగానే జిల్లా కలెక్టర్తో మాట్లాడి సైఫన్ మరమ్మతుల కోసం తక్షణమే ₹27 లక్షల నిధులు మంజూరు చేయించాము:ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి
కాలువ కింద ఉన్న సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు, సాగునీటి సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది:ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి
ఎందుకు లేదా స్థానిక రైతుల సహకారంతో సైఫన్ పునరుద్ధరణ పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం:ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి
కాలువ కింద ఉన్న రైతులందరూ ఒకరికే ఎక్కువ నీరు నిల్వ చేసుకోకుండా, ఆరుతడులతో నీటిని వాడుకుంటూ సమన్వయం పాటించాలని విజ్ఞప్తి:ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి
రాబోయే రెండు మూడు రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేసి కావలి కాలువ కింద రైతాంగానికి, తాగునీటికి ఇబ్బంది లేకుండా మళ్లీ నీటిని అందిస్తాం:ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి



