ఉదయగిరి ఎన్బో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను ఎంఈఓ-1 టి. వెంకటేశ్వర్లు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నోట్బుక్స్, వర్క్బుక్స్తో పాటు జాదూ పితారా కిట్ల వినియోగాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమాధానాలు రాసేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించాలని తెలిపారు. పరీక్షలు పూర్తయిన వెంటనే విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో త్వరగా నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరిచేందుకు నిరంతరం పర్యవేక్షణ అవసరమని ఎంఈఓ పేర్కొన్నారు.

ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను పరిశీలించిన ఎంఈఓ
ఉదయగిరి ఎన్బో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను ఎంఈఓ-1 టి. వెంకటేశ్వర్లు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నోట్బుక్స్, వర్క్బుక్స్తో పాటు జాదూ పితారా కిట్ల వినియోగాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమాధానాలు రాసేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించాలని తెలిపారు. పరీక్షలు పూర్తయిన వెంటనే విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో త్వరగా నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరిచేందుకు నిరంతరం పర్యవేక్షణ అవసరమని ఎంఈఓ పేర్కొన్నారు.

