పాడేరు ఐటీడీఏలో 16 నెలలుగా పాలకవర్గ సమావేశం జరగకపోవడం గిరిజనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఈ మేరకు బుధవారం అరకులోయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, డోలిమోతలు వంటి సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మూడు నెలలకు ఒకసారి సమావేశం జరగాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం, కలెక్టర్, ఐటీడీఏ పీవో వెంటనే సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం సమీక్షలు నిరంతరం జరగాలని, ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలి : అరకు ఎమ్మెల్యే
పాడేరు ఐటీడీఏలో 16 నెలలుగా పాలకవర్గ సమావేశం జరగకపోవడం గిరిజనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఈ మేరకు బుధవారం అరకులోయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, డోలిమోతలు వంటి సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మూడు నెలలకు ఒకసారి సమావేశం జరగాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం, కలెక్టర్, ఐటీడీఏ పీవో వెంటనే సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం సమీక్షలు నిరంతరం జరగాలని, ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

