శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక రాజకీయ ప్రకటన చేశారు. ఏపీలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతూ కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని వెల్లడించారు. ప్రజల తరఫున, ప్రజల కోసం ప్రజాపక్షంగా నిలబడటమే పార్టీ లక్ష్యమన్నారు. ప్రజావాణిని అసెంబ్లీ, పార్లమెంట్లో బలంగా వినిపిస్తానని చెప్పారు. బాధ్యతాయుత ప్రతినిధిగా పనిచేస్తానన్నారు. ఈ నెలలోనే విజయవాడలో విస్తృత స్థాయి మీడియా సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, కార్యాచరణను వెల్లడిస్తానని తెలిపారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న విజయ్ సాయి రెడ్డి
శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక రాజకీయ ప్రకటన చేశారు. ఏపీలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతూ కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని వెల్లడించారు. ప్రజల తరఫున, ప్రజల కోసం ప్రజాపక్షంగా నిలబడటమే పార్టీ లక్ష్యమన్నారు. ప్రజావాణిని అసెంబ్లీ, పార్లమెంట్లో బలంగా వినిపిస్తానని చెప్పారు. బాధ్యతాయుత ప్రతినిధిగా పనిచేస్తానన్నారు. ఈ నెలలోనే విజయవాడలో విస్తృత స్థాయి మీడియా సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, కార్యాచరణను వెల్లడిస్తానని తెలిపారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

