పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో పలు రహదారులు జలమయమయ్యాయి పాత బస్టాండ్ నేతన్న చౌక్ వెంకంపేట రోడ్డు సంజీవయ్య నగర్ ఆటోనగర్ ప్రాంతాల్లో నీరు నిలిచింది సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై నీరు చేరడంతో వాహనదారులు పాద చారులు ఇబ్బందులు పడ్డారు డ్రైనేజీ మురుగునీరు రోడ్డుపైకి రావడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు



