మన్యం జిల్లాలోనే అతిపెద్ద సంతల్లో ఒకటైన పెదబయలు సంత ప్రతి సోమవారం జరుగుతుంది. ఇక్కడికి ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల నుండి ప్రజలు, వ్యాపారులు వస్తుంటారు. ప్రతివారం దాదాపు రూ. కోటి మేర లావాదేవీలు సాగుతాయి. అయితే, రెండు వారాల క్రితం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ఒక భారీ వృక్షం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ఆరుగురు గాయపడ్డారు.
దీంతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మిగిలిన భారీ చెట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. చెట్లను తొలగించడానికి అటవీశాఖ, జిల్లా కలెక్టర్ అనుమతులు అవసరమని, ప్రతిపాదనలు పంపామని ఎంపీడీఓ శ్యాంసుందరరావు తెలిపారు. అనుమతులు రాగానే చెట్లను తొలగిస్తామన్నారు.


