ఖమ్మం జులై
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం టూ టౌన్ మండలంలో నిర్వహిస్తున్న ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నేడు మరియు రేపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ పర్యటించనున్నట్లు టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు గెంటేల విద్యాసాగర్ కూడా పర్యటనలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
టూ టౌన్ పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ ఈ పర్యటనను విజయవంతం చేయాలని ధనియాకుల వెంకట్ నారాయణ విజ్ఞప్తి చేశారు.



