– ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేయాలి
– పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
– దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలి
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
విశాఖపట్నం
విత్తనాల బంతులతో విశాఖ ను హరిత మయం చేద్దాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం విశాఖపట్నం లోని పెద్ద వాల్తేరు కెడిపిఎం ఉన్నత పాఠశాల హెచ్ ఎం సుమతీబాయ్ అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ నేతృత్వంలో విత్తనాల బంతులు తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేయాలి అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విత్తనాల బంతులు తయారు చేయడం జరిగుతోందని వివరించారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ నలబై ఏళ్లుగా విత్తనాల బంతులు విద్యార్థులతో, అధికారులతో తయారు చేయించడం జరుగుతుంది అన్నారు. అంతే కాక పలుమార్లు భారత నావికా దళ హెలికాప్టర్లు ద్వారా జల్లడం జరుగుతోంది అని వివరించారు.
హెచ్ ఎం సుమతీబాయ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలి అని కోరారు. విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచుదాం అని పేర్కొన్నారు. ప్రకృతి వనరుల పరిరక్షణ మానవాళి బాధ్యత అని పేర్కొన్నారు. తాను చాలా కాలంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ తొ కలిసి విత్తనాల బంతులు తయారు చేయడం జరిగుతోంది అని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి, హిందీ టిచర్ సుజాత మాట్లాడారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విత్తనాల బంతులు తయారు చేయడం జరిగింది.


