తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కరూర్లో గత ఏడాది టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 32 మంది బాధితుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. వారి విద్యార్హతలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ₹1,700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న నాన్-లెదర్ పాదరక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 13,500 మందికి ఉపాధి లభించనుంది. అయితే విచారణ పూర్తికాకముందే ఉద్యోగాలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని సీపీఐ, సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేశాయి.

కరూర్ విషాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కరూర్లో గత ఏడాది టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 32 మంది బాధితుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. వారి విద్యార్హతలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ₹1,700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న నాన్-లెదర్ పాదరక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 13,500 మందికి ఉపాధి లభించనుంది. అయితే విచారణ పూర్తికాకముందే ఉద్యోగాలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని సీపీఐ, సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేశాయి.

