ఎలమంచిలి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్న ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ మహాసభలకు 28 జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. మహాసభల్లో నూతన కమిటీ ఎన్నికతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ రహమాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ కాసుబాబు తెలిపారు. కార్మికులపై అధిక జరిమానాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ చార్జీలు తగ్గించాలని, ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న జీవీఎంసీ గాంధీ పార్కులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఎలమంచిలిలో ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ మహాసభలు.. కార్మికుల సమస్యలపై గళం
ఎలమంచిలి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్న ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ మహాసభలకు 28 జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. మహాసభల్లో నూతన కమిటీ ఎన్నికతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ రహమాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ కాసుబాబు తెలిపారు. కార్మికులపై అధిక జరిమానాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ చార్జీలు తగ్గించాలని, ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న జీవీఎంసీ గాంధీ పార్కులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

