దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. 61,92,396 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,693.90 కోట్లను విడుదల చేసింది.
కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పింఛన్లు ఈ నెల నుంచి అందిస్తున్నారు. ఉదయం 11 గంటల సమయానికి 85 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తయింది.
మరికొద్ది సేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సీఎం చంద్రబాబు గారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
#పేదలసేవలో


