ఆత్మకూరు పట్టణంలోని దర్గా సెంటర్లో వృద్ధుడిపై దాడి చేసి నగదు అపహరించిన ఘటన కలకలం రేపింది. నాగులపాడు గ్రామానికి చెందిన నారయ్య అనే వృద్ధుడు కొంతకాలంగా ఆత్మకూరులో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈ నెల 1న పెన్షన్గా వచ్చిన డబ్బులతో పాటు తన వద్ద ఉన్న నగదును కలిపి మొత్తం రూ.4,500ను ఉంచుకుని దర్గా సెంటర్లో నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో కొందరు యువకులు తనపై దాడి చేసి నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

ఆత్మకూరులో వృద్ధుడిపై దాడి.. పెన్షన్ డబ్బులు అపహరణ
ఆత్మకూరు పట్టణంలోని దర్గా సెంటర్లో వృద్ధుడిపై దాడి చేసి నగదు అపహరించిన ఘటన కలకలం రేపింది. నాగులపాడు గ్రామానికి చెందిన నారయ్య అనే వృద్ధుడు కొంతకాలంగా ఆత్మకూరులో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈ నెల 1న పెన్షన్గా వచ్చిన డబ్బులతో పాటు తన వద్ద ఉన్న నగదును కలిపి మొత్తం రూ.4,500ను ఉంచుకుని దర్గా సెంటర్లో నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో కొందరు యువకులు తనపై దాడి చేసి నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

