నంద్యాల: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న నంద్యాల పట్టణంలోని అన్ని మటన్, చికెన్ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న ఆదేశించారు.జాతీయ పండుగను పురస్కరించుకుని మాంసం విక్రయాలు నిర్వహించకుండా వ్యాపారులు మున్సిపాలిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే మున్సిపల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు భారీగా అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు.దుకాణాల యజమానులు ఆగస్టు 15న పూర్తిగా దుకాణాలు మూసివేసి మున్సిపాలిటీకి సహకరించాలని కమిషనర్ కోరారు. నిబంధనల అమలును మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపారు.

ఆగస్టు 15న నంద్యాలలో మాంసం దుకాణాలు బంద్
నంద్యాల: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న నంద్యాల పట్టణంలోని అన్ని మటన్, చికెన్ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న ఆదేశించారు.జాతీయ పండుగను పురస్కరించుకుని మాంసం విక్రయాలు నిర్వహించకుండా వ్యాపారులు మున్సిపాలిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే మున్సిపల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు భారీగా అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు.దుకాణాల యజమానులు ఆగస్టు 15న పూర్తిగా దుకాణాలు మూసివేసి మున్సిపాలిటీకి సహకరించాలని కమిషనర్ కోరారు. నిబంధనల అమలును మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపారు.

