నంద్యాల : జిల్లాలో పోటీ పరీక్షలు, క్రీడలు, వివిధ కళల్లో శిక్షణ అందిస్తున్న కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా తమ కేంద్రాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా తెలిపారు.50 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు, అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న కేంద్రాలు సెప్టెంబర్ 30లోగా సీఐఆర్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు కేంద్రాల వివరాలను పరిశీలించి నమోదు ధ్రువపత్రాలు జారీ చేస్తామని తెలిపారు గడువులోగా నమోదు చేసుకోని, నిబంధనలు పాటించని శిక్షణ కేంద్రాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు

శిక్షణ కేంద్రాల నమోదు తప్పనిసరి
నంద్యాల : జిల్లాలో పోటీ పరీక్షలు, క్రీడలు, వివిధ కళల్లో శిక్షణ అందిస్తున్న కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా తమ కేంద్రాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా తెలిపారు.50 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు, అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న కేంద్రాలు సెప్టెంబర్ 30లోగా సీఐఆర్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు కేంద్రాల వివరాలను పరిశీలించి నమోదు ధ్రువపత్రాలు జారీ చేస్తామని తెలిపారు గడువులోగా నమోదు చేసుకోని, నిబంధనలు పాటించని శిక్షణ కేంద్రాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు

