తిరుపతి ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి
ఆగస్ట్ 24 నుంచి 27వ తేదీ వరకు తిరుపతి వేదికగా నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్షిప్–2026 రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను శాప్ చైర్మన్ రవి నాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ అధికారులతో కలిసి శనివారం పరిశీలించా రు. స్పోర్ట్స్ నిర్వహించనున్న అన్ని క్రీడా మైదానాలు, క్రీడాకారులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు.
క్రీడా పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు, సిబ్బంది సమన్వయంతో, పకడ్బందీగా పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఏర్పాట్లలో ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ , డి.ఈ మధు , శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, శాప్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


