బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఐలవేణి శేఖర్ ని వారి సామాజిక సేవా కార్యక్రమాలు, మానవ హక్కుల పరిరక్షణ పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించి, తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం – మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు గురువారం ప్రకటనలో తెలిపారు.సంఘం యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజల మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని, బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు



