పాలేరు /ఖమ్మం
భూ భారతి చట్టంపై బీజేపీ చేపట్టిన మహా దీక్ష కార్యక్రమానికి పాలేరు నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్కు బయలుదేరారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు, బీజేపీ శాసనసభా పక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపు మేరకు ఈ మహా దీక్ష నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
పాలేరు నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ నున్నా రవికుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్కు తరలివెళ్లారు. భూ భారతి చట్టంలోని సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఈ దీక్ష చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోటి హనుమంతరావు, హేత్యా నాయక్, దాసరి వెంకటేశ్వర్లు, కోటమర్తి సుదర్శన్, నున్నా వెంకటేశ్వర్లు, వెంకన్న, మహేందర్, మీగడ గోపి, పొన్నం ఉపేందర్, కొమ్మునేని కొండల్ రావు, వెంకట్ రెడ్డి, మధు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు



