పున్నమి ప్రతినిధి,రామచంద్రపురం జూలై 24
రామచంద్రాపురంమండలంలోని అనుపల్లి పంచాయితీ
బీరమాకుల కండ్రిగ సమీపంలో వెలసి ఉన్న ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయ ప్రాంగణంలో పంచమ వేద మహాభారత ఉత్సవాలు శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.ఉత్సవాల్లో భాగంగా అనుపల్లి, కొత్త వేపకుప్పం, గంగుడుపల్లి పంచాయతీల పరిసర గ్రామాలలో ఉత్సవ విగ్రహాలను శుక్రవారం నుండి ఘనంగా ఊరేగించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.జూలై 30వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 11 రోజులపాటు జరగనున్నాయని ప్రతిరోజూ పగటిపూట హరికథ గానం, రాత్రి వేళల్లో వీధి నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.


