నంద్యాల: గాంధీచౌక్ వద్ద శ్రీ గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీ తాతిరెడ్డి తులసిరెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా అవ్వరు జ్యూవెలరీ అధినేత గౌరీనాథ్ మరియు ఇతర ముఖ్య నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ… ఆధ్యాత్మిక భావన సమాజంలో ఐక్యతను, సమరసతను పెంచుతుందని అన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసి, నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు.కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులను, ఉత్సవ కమిటీ సభ్యులను నిర్వాహకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, యువకుల కోలాటాలు, భక్తుల జయ జయధ్వనుల మధ్య స్వామివారి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

గాంధీచౌక్లో ఘనంగా గణేష్ నిమజ్జన మహోత్సవం :మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి
నంద్యాల: గాంధీచౌక్ వద్ద శ్రీ గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీ తాతిరెడ్డి తులసిరెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా అవ్వరు జ్యూవెలరీ అధినేత గౌరీనాథ్ మరియు ఇతర ముఖ్య నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ… ఆధ్యాత్మిక భావన సమాజంలో ఐక్యతను, సమరసతను పెంచుతుందని అన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసి, నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు.కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులను, ఉత్సవ కమిటీ సభ్యులను నిర్వాహకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, యువకుల కోలాటాలు, భక్తుల జయ జయధ్వనుల మధ్య స్వామివారి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

