ఖానాపురం పున్నం ప్రతినిధి:
నర్సంపేట ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ సరస్వతి గారిని కలిసి విజ్ఞప్తి పత్రం అందజేసిన జనసేన నియోజకవర్గ నాయకులు శివకోటి యాదవ్
ఈరోజు జనసేన నాయకుడు మేరుగు శివకోటి యాదవ్ నర్సంపేట ఆర్టీసీ డిపోలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా వివిధ మార్గాల్లో తగ్గించిన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని,పదవి విరమణ,బదలాయింపులతో సిబ్బంది కొరత లేకుండా చూడాలని డిపో మేనేజర్ సరస్వతి గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది.
శివకోటి యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా చూసుకుంటే నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి నిజామాబాద్ కు వెళ్లే 15 నుంచి 17 బస్సు సర్వీస్ లను, అలాగే శ్రీశైలం,భద్రాచలం అదిలాబాద్ తదితర మార్గాల లో బస్సులు తగ్గించారని,అలాగే డిపోలో ఉన్న కొంతమంది ఉద్యోగులు పదవి విరమణ పొందడం,ఇతర డిపోలకి బదిలీ అవ్వడం వల్ల సిబ్బంది కొరత ఉన్నట్లు తద్వారా నర్సంపేట ప్రాంత ప్రజలు వివిధ ప్రాంతాలకు సురక్షితంగా ప్రయాణించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు జనసేన పార్టీ దృష్టికి రావడంతో ఈ సమస్య పరిష్కారం కోసం డిపో మేనేజర్ సరస్వతి గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. జనసేన నేతలు ఎలాబోయిన డేవిడ్. రోడ్డ శ్రీకాంత్. టేకుల రవి. బోడ వీరన్న. ఎస్.కె హుస్సేన్. తదితరులు పాల్గొన్నారు.


