ఖమ్మం 53వ డివిజన్ పాత బీజేపీ పార్టీ కార్యాలయం వెనుక లైన్లో జక్కుల సందీప్ ఏర్పాటు చేసిన గణనాథుడిని, 57వ డివిజన్లో ఇనుగుర్తి ఉపేంద్రమ్మ ఏర్పాటు చేసిన గణనాథుడిని బీజేపీ నాయకులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ, టూ టౌన్ ట్రెజరర్ దాసరి వీరభద్రం, టూ టౌన్ ఉపాధ్యక్షురాలు ఉపేంద్ర, రమణ, శ్రీనివాస్, ఉపేందర్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.



