*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ* ఆగస్టు 06 తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో మోర్ సూపర్ మార్కెట్లో గడువు ముగిసిన (ఎక్స్పైరీ) పాల ప్యాకెట్లను విక్రయించారని ఓ వినియోగదారుడు ఆరోపించారు. మార్కెట్లో కొనుగోలు చేసిన పాల ప్యాకెట్ను ఇంటికి తీసుకెళ్లి కాచగా వెంటనే పాలువిరిగిపోయాయని ఆయన తెలిపారు.దీంతో పాల ప్యాకెట్పై ఉన్న తయారీ, గడువు తేదీలనుపరిశీలించగా గడువు ముగిసినట్లు గుర్తించినట్లు వినియోగదారుడు వెల్లడించారు. అనంతరం ఈ విషయాన్ని సూపర్ మార్కెట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, వారు నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు.ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు వంటి సున్నిత వర్గాలు పాల ఉత్పత్తులను ఎక్కువగావినియోగించే నేపథ్యంలో, గడువు ముగిసిన లేదా పాడైన పాలు విక్రయిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి పాలను చిన్నారులు తాగితే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి ఆహార సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
ఈ ఘటనపై ఆహార భద్రతశాఖఅధికారులు స్పందించి, సంబంధిత సూపర్ మార్కెట్లో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు



