శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు శ్రీ సీతారాం పాత్రుడు నవీన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, సెప్టెంబర్ 03 ( పున్నమి ప్రతినిధి )
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు మాకేనా సీతారాం పాత్రుడు (నవీన్) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా ప్రస్తుతం సేవలందిస్తున్న ఆయన, శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
శ్రీకృష్ణుని బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ధర్మం, సత్యం, న్యాయం పట్ల ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం తన వంతు కృషి చేస్తానని సీతారాం పాత్రుడు నవీన్ తెలిపారు.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రజలందరి ఇళ్లలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.


