ఆగస్టు 28, 2026
ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల లభ్యతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని పేర్కొన్నారు. రైతులకు ఎరువుల లభ్యతలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఎరువులను నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయించే ప్రైవేట్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరైనా ఎరువుల విషయంలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఎరువుల్ని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
ఆగస్టు 28, 2026 ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల లభ్యతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని పేర్కొన్నారు. రైతులకు ఎరువుల లభ్యతలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఎరువులను నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయించే ప్రైవేట్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరైనా ఎరువుల విషయంలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

