అనపర్తి, సెప్టెంబర్ 19 (పున్నమి ప్రతినిధి): తాపీ ధర్మారావు జయంతి సందర్భంగా అనపర్తిలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవహారిక భాషను జర్నలిజంలోకి తీసుకురావడంలో తాపీ ధర్మారావు కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసి భాషాభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. నేటి తరంలో తెలుగు, వ్యవహారిక భాషపై పట్టు తగ్గుతున్న నేపథ్యంలో మాతృభాషను ఆదరిస్తూనే వ్యవహారిక భాషను అలవర్చుకోవాలని సూచించారు. తాపీ ధర్మారావు వంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని భాషా విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



