తూమాటి ఏకగ్రీవ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు శాసనమండలి ఛైర్మన్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం మండలి సభ్యులు మాధవరావుకు అభినందనలు తెలిపారు. శాసనమండలి కార్యకలాపాలను సమర్థంగా నిర్వహిస్తూ సభా సంప్రదాయాలు, నియమాలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని తూమాటి మాధవరావు పేర్కొన్నారు.


