ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారులతో కలిసి బుధవారం స్థానిక మినీ బైపాస్ అన్నమయ్య కూడలి సమీపంలోని జాకీ షోరూం పరిసర ప్రాంతాలలో పర్యటించారు. సమస్యలు పునరావృతం కాకుండా వాటికి శాశ్వతంగా పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం సమీపంలోని వెంగన్న కాలువను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సర్వేయర్ కామేశ్వరరావు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.


