రూగ్వేదం పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
ఖమ్మం నగరంలోని చెరువు బజార్లో గల రూగ్వేదం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో అలరించారు. పాఠశాల ఆవరణలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల అధ్యక్షుడు భాను ప్రకాష్ బొర్రా, డైరెక్టర్ సుకృతి బొప్పిశెట్టి, కరస్పాండెంట్ డాక్టర్ లక్ష్మి ఆకుల, ప్రధానోపాధ్యాయురాలు షేక్ నజీమా, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులు శ్రీకృష్ణుడి బాల్యలీలలను ప్రదర్శించి అందరినీ అలరించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు కృష్ణాష్టమి విశిష్టతను వివరించింది. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.



