Saturday, 5 September 2026

Tag: గండేపల్లి

తూర్పు గోదావరి

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఇంటింటికి వెళ్లి అందించిన జ్యోతుల నవీన్

*గండేపల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ – 14 మందికి రూ. ఆరు లక్షల 30 వేల రూపాయల చెక్కులు – ఇంటింటికి వెళ్లి పరామర్శించిన జ్యోతుల నవీన్* *కాకినాడ , గండేపల్లి, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 27:* గండేపల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 14 మందికి రూ. 6 లక్షల 30 వేల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. నీలాద్రి రావు పేటలో 4 మందికి, తాళ్లూరులో ఇద్దరికి, మల్లేపల్లిలో ముగ్గురికి, యల్లమల్లిలో ఒకరికి, నాయకంపల్లిలో ఇద్దరికి, యర్రంపాలెంలో ఇద్దరికి రూ. 6 లక్షల 30 వేల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. గురువారం ఇంటింటికి వెళ్లి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై 14 మంది ఇళ్లకు స్వయంగా వెళ్లి ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు వరంగా మారాయని అన్నారు. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కులం, మతం, పార్టీల భేదాలు లేకుండా అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందిస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుకే పరిమితమైందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారకుండా సీఎం సహాయనిధి ద్వారా నేరుగా లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు, జీను మణి బాబు, కందుల చిట్టిబాబు, కుంచె రాజా, జాస్తి వసంత్, అడబాల రామాంజనేయులు, బుర్రి సత్తిబాబు, కుంచే రామకృష్ణ, ఆయా గ్రామాల కూటమి నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

తాళ్లూరు లిఫ్ట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

*తాళ్లూరు లిఫ్ట్ పనులు శరవేగం – సెప్టెంబర్ చివరి నాటికి రైతులకు సాగునీరు* *నాలుగోసారి లిఫ్ట్ పనులను పరిశీలించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* గండేపల్లి, పున్నమి ప్రతినిధి,ఆగస్టు 22: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద 31 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 52 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న ఈ పనులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శనివారం నాలుగోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాళ్లూరు లిఫ్ట్ కు శంకుస్థాపన చేసి నిధులు మంజూరు చేశారని, అయితే గత ఏడు సంవత్సరాలుగా సిమెంట్ పైపులు పాడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 52 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని, దీనిపై కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వర్షాల కారణంగా పనులకు ఆటంకం కలుగుతోందని, ఒక్కరోజు వర్షం కురిస్తే నాలుగు రోజుల పాటు పనులు నిలిచిపోతున్నాయని తెలిపారు. అయినప్పటికీ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని, జిందాల్ కంపెనీ ఐరన్ పైపులకు మెష్ ఏర్పాటు చేసి హై ప్రెజర్ సిమెంట్ కోటింగుతో పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. కొందరు పనుల పరిశీలన పేరుతో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, గతంలో లిఫ్ట్ పని చేయనప్పుడు వారు ఏం చేశారని ప్రశ్నించారు. తాను రైతు పక్షపాతిగా ఈ ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నానని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గానికి నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకువచ్చారని, తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆ ప్రాజెక్టులను సాధించానని, గతంలో పని చేసిన వారు ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. తాళ్లూరు లిఫ్ట్ పనులు ఆపి మామిడాడ జ్యోతుల పాపారావు సాగునీటి పథకం పనులు చేయిస్తున్నారని కొందరు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. మామిడాడ పథకం 3500 ఎకరాల ఆయకట్టుకు, నాలుగు గ్రామాలకు నీరు అందించేందుకు 3 కోట్ల 82 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో పూర్తి చేశామని, ఆ పథకం కింద గానీ, ఈ నాలుగు సాగునీటి ప్రాజెక్టుల కింద గానీ తనకు ఒక్క ఎకరా భూమి కూడా లేదని, తన భూమికి తాను సొంతంగా బోర్లు వేయించుకుని సాగు చేసుకుంటున్నానని స్పష్టం చేశారు. వాతావరణం అనుకూలిస్తే, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సెప్టెంబర్ నెల చివరి నాటికి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పైడిపాల సూరిబాబు, పిల్లా చంటిబాబు, రేఖ బుల్లిరాజు, జాస్తి వసంత్, ఉప్పలపాటి బుల్లెబ్బాయ్, దాసరి సీతారామకృష్ణ, పురంశెట్టి శివాజీ, సుంకవిల్లి రాజు, యర్రంశెట్టి బాబ్జి, కురుకూరి వీర వెంకట చౌదరి, శిలామంతుల వీరబాబు, పి. వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి సంక్షేమం

*కూటమి ప్రభుత్వంలోఅభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు గండేపల్లి లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు…* కాకినాడ, గండేపల్లి, పున్నమి ప్రతినిధి,ఆగస్టు 17 :రాష్ట్ర అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు వ్యాఖ్యానించారు. సోమవారం గండేపల్లి గ్రామంలో గ్రామ టిడిపి అధ్యక్షులు బొల్లంరెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండేళ్ల కూటమి ప్రభుత్వం నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో పోతుల మోహన రావుముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మొదటగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేసి ప్రజల నుంచి సమస్యను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహనరావు మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. సామాజిక భద్రతా పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, దీపం 2 పథకం, తల్లికి వందనం, స్త్రీ శక్తి తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించారు. వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలితే కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. గత రెండేళ్లలో గండేపల్లి గ్రామంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు.అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు రైతులకు , ఆటో డ్రైవర్లకు 15000అందజేయడం, సామాజిక పెన్షన్ లు4000, దివ్యాంగులకు 6000, 10000, 15000 తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 13000 అందజేయడం జరిగిందన్నారు. గ్రామంలో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, సీసీ ట్రైన్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పరుగులు పెడుతుందని అన్నారు.ఈకార్యక్రమంలో వెంపాటి రాజు, ఆళ్ల సత్తిబాబు, ఇప్పర్ల సురేష్, పైల వెంకన్న, చిటికెల కన్నబాబు, ముంగర సూర్యరావు, తణుకు వీర వెంకట సత్యనారాయణ, ఇనుపకోళ్ల సంజీవయ్య, పెనుగాడి నాగరాజు, నాళం వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.