నాగర్కర్నూల్ ఎంపీడీవో కార్యాలయంలో విద్యాశాఖ, సమగ్ర శిక్ష, అలీంకో ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి విద్యార్థులకు ప్రత్యేక పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల చదువుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ పరికరాలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో రమేష్, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు





