Thursday, 9 July 2026

Blog

Featured

ఎర్రజెండా అండగా… సేవే లక్ష్యంగా కదిలిన ఎర్రసైన్యం

మేమున్నామని!_ మీకేం కాదని! ===================== _ ఎర్రజెండా అండగా… సేవే లక్ష్యంగా కదిలిన ఎర్రసైన్యం _ 21 22 డివిజన్లలో 40 రోజులపాటు నిరుపేదల ఆకలి తీర్చిన వైనం! _ ప్రతి రోజు 400 మందికి ఆహారం అందించిన సిపిఎం కార్యకర్తలు! _ లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 16 వేల మంది కార్మికులకు ఆహార పొట్లాల పంపిణీ! _ సేవే లక్ష్యంగా కృషి చేస్తున్న కార్యకర్తలకు తోడుగా నిలిచిన దాతలు దేశంలో కరోనా మహమ్మారిని నిరోధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే! దాంతో ప్రజా జీవనానికి కూడా లాక్ డౌన్ పడ్డట్లయింది. ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో ఉపాధి కోల్పోయారు ముఖ్యంగా నిరుపేదలు, కార్మికుల కు జీవనోపాధి లేక వారి కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. ఇటువంటి విపత్కర సమయంలో నైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుంటా ఏమోనని పేదలు ఆశించారు. ప్రభుత్వం కుటుంబానికి వెయ్యి రూపాయలు, తలకు 5 కేజీల రేషన్ బియ్యం అందించి మీ కష్టం మీరు పడండి అంటూ చేతులు దులుపు కుంది. అటువంటి సమయంలో మేమున్నామంటూ సిపిఎం కార్యకర్తలు చేదోడువాదోడుగా నిలిచి గత నలభై రోజులుగా వారి ఆకలి బాధలు తీరుస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 21 22 డివిజన్లలో శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా ఏ పూటకాపూట సంపాదించుకొని కడుపు నింపుకునే వారే! లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవడం కష్టంగా ఉన్నా వారికి ఆ ప్రాంతంలో ఉన్న సిపిఎం కార్యకర్తలు అండగా నిలిచారు.21 22 డివిజన్ల సిపిఎం శాఖల ఆధ్వర్యంలో ఒక నిరంతర ఆహార తయారీ కేంద్రాన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కార్మికులకి, నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందజేసేందుకు, కార్యకర్తలే రంగంలోకి దిగి అన్నం కూరలు వండి ప్యాకెట్లు చేసేవారు. సీపీఎం రూరల్ కమిటీ సభ్యుడు, శాఖా కార్యదర్శులు, పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల కార్యకర్తలు అందరూ ఒక టీం గా ఏర్పడి క్రమశిక్షణతో పేదలకు ఆహార పొట్లాలు అందించేందుకు నిరంతరం కృషి చేశారు. పేదలకు సహాయం చేసే సందర్భంలో కార్యకర్తలు తమ కుటుంబ సమస్యలు, ఇబ్బందులను కూడా మరిచారు. కార్యకర్తలంతా అంకితభావంతో పని చేయడం ద్వారానే 40 రోజులపాటు నిరంతరంగా 16 వేల మంది ఆకలి బాధలు తీరుస్తూ అందరికీ ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. మీరు చల్లగా ఉండాలని ఆ ప్రాంత ప్రజలు అందిస్తున్న దీవెనలు, కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో మరింత ఉత్సాహంగా పాల్గొనేందుకు తోడ్పడాలని కోరుకుందాం. ఇటువంటి విపత్కర సమయాల్లో ఆ ప్రాంతంలో పలువురు దాతలు సిపిఎం కార్యకర్తలు చేస్తున్న కృషిని గుర్తించి మేము మీకు తోడుగా ఉంటామని చేయూత నందించడం అభినందనీయం.

Featured

ఆశా వాలంటీర్ల సేవలు అభినందనీయం

06.05.2020, నెల్లూరు,(పున్నమి ప్రతినిధి – సి.ఎస్.రావు) *ఆశా వాలంటీర్ల సేవలు అభినందనీయం* జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం ప్రాంగణం నెల్లూరు నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు చేజర్ల సుధాకర్ రావు గారి ఆధ్వర్యంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నెల్లూరు వారి సహకారంతో జిల్లా సెక్రటరీ రామ్ కుమార్ గారి అధ్యక్షతన నెల్లూరు సిటీ 8 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిథి లోని 96 మంది ఆషా వాలంటీర్లుకు, శానిటైజర్లు, మాస్క్ లు, హెడ్ పిపి కిట్లను అందజేయడం జరిగింది. కరోనా కోవిద్ 19 విధుల్లో ఆషాల సేవలు వెలకట్టలేనివి అని,కరోనా వ్యాధిగ్రస్తులు గాని, ప్రజలు గాని ఆషా వాలంటీర్ల సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం జరిగింది అని, 17 మంది కరోనా పాజిటివ్ కేసులకు అత్యుత్తమ స్థాయిలో సేవలందించిన సాధన. కళ్యాణి ఆషా వాలంటీర్ గారిని ఎనిమిది పాజిటివ్ కేసులు మంచిగా సేవలందించిన మాధవి గారిని ఘనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు చేజర్ల సుధాకర్ రావు మరియు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ లీడర్ పి వి సుబ్బారావు గార్లు ఘనంగా అభినందించడం జరిగింది ,అనంతరం ఆశా వాలంటీర్లకు పూలు చల్లుతూ అభినందించి వారు చేసిన సేవలను కొనియాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లు ఆషా వాలంటీర్లకు సెల్యూట్ చేయడం జరిగినది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నెల్లూరు జిల్లా శాఖ శ్రీ రామ్ కుమార్ జిల్లా సెక్రెటరీ ,పి.వీ సుబ్బారావు స్టేట్ లీడర్ గారి ఆధ్వర్యంలో లాక్ డౌన్ కాలంలో తిండి తిప్పలు లేనివారికి వలస కూలీలకు, నేషనల్ హైవేపై వెళ్తున్న వేలాదిమందికి అన్నదానం చేయడంతోపాటు,కరోనా సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది ,ఆశ వాలంటీర్లకు అత్యవసర మాస్కులు అందజేస్తూ వారు సేవ చేయడం జరిగిందని, వీరి సేవలు అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు శశి ,మజారులా,పి. కిష్టయ్య, జి. సుధాకర్ రెడ్డి, యమ్. శ్రీనివాసులు డిస్టిక్ కమ్యూనిటీ మొబిలైజేషర్ సునీత ,భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు టి కృష్ణ కుమార్ RSL,బాల బ్రహ్మయ్య , పి సాయి నిత్యా రెడ్డి ,జి .భానుతేజ 8 అర్బన్ హెల్త్ సెంటర్లో కమ్యూనిటీ ఆర్గనైజర్లు తిరుపతయ్య ,వేణు, సుభాషిణి, ఏ .విజయలక్ష్మి ,బి. వెంకటయ్య ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Featured

డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు ఎందరికో ఆదర్శం ….

డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు ఎందరికో ఆదర్శం … సాధారణంగా పేద మద్యతరగతి ప్రజలకు వైద్యసేవలందించడంలో నెల్లూరులో ఉన్న ఎన్నో ఆసుపత్రులలో డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆసుపత్రి(పీపీసీ) ఒక విశిష్టత పొంది ఉంది. అయితే కొందరిలో ఈ ఆసుపత్రి పట్ల ఈకార్పొరేటు ఆసుపత్రుల మాయాజాలం చూసినోళ్ళకు వేరే అభిప్రాయం ఉంది. అందుకే ఈ ఆసుపత్రిలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి కన్నా ఎక్కువ రోగులు ఓపి..ఇన్ పేషెంట్లు గా ఉంటారు. ఒక ఆశయంతో సేవల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా సరైన, సహేతుక వైద్యాన్ని అందించడం లో అతితక్కువ ధరలలో మంచి వైద్యం అందిస్తున్నా….ఈరోజుల్లో కొన్ని మద్యతరగతి వర్గాలకు ఏ ఆసుపత్రిలో చూపించుకున్నావు అనేది ఓ స్టేటస్ సింబల్ గా కూడా ఉంది.అటువంటి అభిప్రాయాలు ఈమద్యకాలంలో ముఖ్యంగా విద్య‌,వైద్యం విషయంలో కార్పొరేటు కల్చర్ కనిపిస్తుంది. ఈ కరోనా కష్టకాలంలో కార్పొరేటు ఆసుపత్రులన్నీ ఎన్నోకారణాలతో మూసేసి జంప్ అయ్యారు. కిటకిటలాడే పొగతోట నెల్లూరు ఆసుపత్రుల హబ్ నిర్మానుష్యంగా అయింది.ఇప్పటిదాకా లేనిజబ్బులకు వైద్యం జరిగిందా అన్న వ్యాఖ్యానాలు జోకులూ వినిపించాయి. అంతలో కొంతో ఎంతో వాస్తవం లేకపోలేదు. అయితే ఈ కరోనా సమయంలో గర్భంతో ఉన్నవారు డెలివరీ డేట్ దగ్గరపడ్డావాళ్ళు వాళ్ళబంధువులూ టెన్షన్…అప్పటిదాకా చూస్తున్న డాక్టర్లు కొందరయితే ఫోన్లూ బంద్ చేశారు. ఏం చేయాలో తోచని పరిస్థితి లో విపరీతంగా ఒత్తిడి. జిల్లా యంత్రాంగం ఎంత చెప్పినా ఆచరణలో షరా మామూలే. సందట్లో సడేమియా అన్నట్లు ఓ డాక్టర్ అయితే ఏకంగా డెలివరీ కి మూడురోజులకు లకారం వసూలు చేసిందట. చాలామంది ఈసమస్యతో అల్లాడారు. అల్లాడుతున్నారు. ఇక్కడే మా పొరుగింట్లో ఓ అమ్మాయీ(భర్త ) ప్రయివేటు ఉద్యోగి…లాక్డౌను లో చెన్నైలో ఇరుక్కుపోయాడు. సలహా అడిగితే మా ఆవిడ నాకు చెప్పింది. వెంటనే పీపీసి పేరుచెప్పా…కొంత ఓరకమైన అభిప్రాయం ఉన్నా మాట్లాడమని చెప్పారు. రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సూపరింటెండెంట్ డా.రాజేశ్వర్ రావుగారితో మాట్లాడాను. వివరాలు అడిగి సరే పంపించండి అన్నారు. వెళ్ళారు తొలుత అన్ని పరీక్షలు చేసి డెలీవరీ డేటుకు ఓ రెండురోజులు ముందు రమ్మన్నారు. డా.రాధా గారు చాలా నెమ్మదిగా గర్భీణికి ధైర్యం ఇచ్చారు. సిజేరియన్ లపేర డబ్బుగుంజే కార్పొరేటు కల్చర్ కు భిన్నంగా వీలైనంతవరకు సాధారణ డెలివరీ అయ్యేందుకు ప్రయత్నించి అవసరం మేరకే కోత..అనే వైద్యప్రమాణాలను గుర్తెరిగి వైద్యం చేసే అతి కొద్ది ఆసుపత్రులలో పీపీసి అని చెప్పవచ్చు. ఆ అమ్మాయి డెలివరి మొన్న సోమవారం డెలివరీ అదీ నార్మల్ డెలివరీ.. ఆహారం కూడా అందించారట. చాలా చక్కగా ఏవిధమైన విసుగు చూపక వైద్యం ఆతిథ్యం ఇచ్చినట్లు చూచుకున్నారని…జీవితంలో మరచిపోలేమని ఆ అమ్మాయి వారి తల్లిదండ్రులు చెప్పడం…ఇప్పటిదాకా మాకున్న ఓ దురభిప్రాయం..(అనుభవంలేని) ఉండేదని అన్నారు. ఇంతకీ ఆసుపత్రి చేసిన వసూలు కేవలం రూ.ఆరువేల రూపాయలే…ఆశ్చర్యంకదా…లక్షలు గుంజే ఆసుపత్రులెక్కడ… వైద్యోనారాయణోహరి అంటే ఇదేగా…అట్లని కార్పొరేట్ ఆసుపత్రులను నిందించడం కాదు గానీ…వైద్య ప్రమాణాలు మరచి సంపాదనే ధ్యేయంగా ఉన్న కొందరి..కొన్నిఆసుపత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆపద సమయంలో మూసేసుకొని వెళ్ళిపోయిన ఆసుపత్రులకు ప్రజలు ఎంత పెట్టారో…కదా… ఓపీలు బంద్ చేయమనొచ్చు…కానీ ఎంతమంది ఎన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కనీసం తమ రోగీలకు టెలి ఫోన్ ద్వారానైనా ధైర్యం ఇవ్వగలిగారు..ఆలో చించాలి. అప్పుచేయించి మనచే వైద్యమందించే వాడా…లేక ఆపదలో నిఖార్సుగా సహేతుకంగా వైద్యాన్ని అందించేవారా….ప్రజలు ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ రామచంద్రారెడ్డి ఆసుపత్రితో మా ఆత్మకూరు ఆయన మా వీధి వారు మానాన్నకు మంచి స్నేహితుడు డా.చెర్లో రమణారెడ్డి గారిద్వారానే మా కుటుంబానికి ఈ ఆసుపత్రితో అనుబంధం. ఆయన నేను డిగ్రి వీఆర్సిలో చదివేపుడూ ఆర్ధిక సహాయం… ఆతిథ్యం కూడా ఇచ్చాడు. మాకు మాకుటుంబానికి ఈ ఆసుపత్రితో అనుబంధం మంచి అనుభవాలు ఉన్నాయి.తదుపరి ఈ అత్యున్నత ఆశయాలతో ఉన్న ఈ ఆసుపత్రితో కలిసి పూర్వ వృత్తిపరంగా కూడా ఉన్నాను. అందుకు గర్విస్తున్నా…. ఈ కరోనా కష్టకాలంలో అత్యున్నత సేవలందిస్తూన్న డా.పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీ క్లినిక్ వైద్యబృందానికి…సిబ్బందికి అబివందనాలతో…. ఇటువంటి ఆశయాలతో నడిచే నడిపించే వారికి నిజమైన సహకారం అందిద్దాం…. లేట్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారి ఆశయాలను తమ అకుంఠిత దీక్షతో అమరుడిని చేసిన ఆసుపత్రి సిబ్బందికి సెల్యూట్…. జివి నాగరాజరావు, బీ.యస్సీ ఎల్లెల్బీ న్యాయవాది, హైకోర్టు ఆంధ్రప్రదేశ్

Featured

నెల్లూరు జిల్లా కరోనా హెల్త్ బులిటెన్

పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️✍️ జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ నుండి మంగళవారం వరకు 56 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.33 మంది ఐసోలేషన్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.ఈ మేరకు జిల్లా డి ఎం హెచ్ ఓ రాజ్యలక్ష్మి మంగళవారం రాత్రి బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు 5641మందికి కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1568 రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

అందుకే మద్యం ధరలు భారీగా పెంచం:జగన్

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ ఏపీ:మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం ధరలను 75 శాతం పెంచినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.ఇవాళ కొలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ సమావేశమయ్యారు.మద్యం విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పరిమితం చేశామని, మద్యపాన నియంత్రణలో భాగంగా త్వరలోనే మద్యం దుకాణాలను తగ్గిస్తామని తెలిపారు.ఇప్పటికే పర్మిట్ రూంలను రద్దు చేశామన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ ఏపీలో కొత్తగా 67 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 1,717 కు చేరింది. ఇందులో 1094 యక్టీవ్ కేసులు ఉండగా..589 మంది డిశ్చార్జ్ అయ్యారు.అటు మరణాల సంఖ్య 34 కు చేరింది.తాజాగా అనంతపురం జిల్లాలో 2,గుంటూరు 13,కడప 2,కృష్ణా 8,కర్నూలు 25,నెల్లూరు 1, విశాఖ జిల్లాలో 1,వేరే రాష్ట్రాల నుండి వచ్చిన 14 మందికి కరోనా వచ్చింది .

జాతీయ అంతర్జాతీయ

46,433 కి చేరుకున్న కరోనా కేసులు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 46,433 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు 1,568 మంది మృతి చెందారు అని వెల్లడించింది.ఇప్పటివరకు 12,727 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా..32,138 యక్టీవ్ కేసులు ఉన్నాయంది.మహారాష్ట్రలో అత్యధికంగా 14,541 కేసులు నమోదవ్వగా…గుజరాత్ లో 5,804 కేసులు,ఢిల్లీలో 4,898 కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది

ఆంధ్రప్రదేశ్

ఏపీలో మొత్తం 1,25,229 కరోనా టెస్టులు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య రోజురోజుకు పరుగుతోంది.నిన్నటివరకు మొత్తం 1,25,229 కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతీ 10 లక్షల జనాభాకు 2,345 మందికి టెస్టులు చేస్తున్నారు. రోజు వారీ సామర్ధ్యం 10 వేలకు పైగా పెరిగింది.గత 24 గంటల్లో 10,292 మందికి పరీక్షలు జరిపారు. రాష్ట్రంలో సగటున ప్రతీ 76 టెస్టులకు గానూ ఒక పాజిటివ్ కేసు నమోదవుతోంది .అదే దేశ సగటు చూస్తే ప్రతీ 26 పరీక్షలకు ఒక పాజిటివ్ కేసు వస్తోంది.

Featured

నాయీ బ్రాహ్మణులకు రూ.1000 నగదు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ నెల్లూరు:ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితులలో నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ వెంకటేశ్వర్లు విజ్ఞాప్తి చేశారు.అభయహస్తం అధినేత డాక్టర్ చేరుకుపల్లి భాస్కర్ రెడ్డి,డాక్టర్ మధులత దాతృత్వంతో నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నగదు అందించారు. ఈ కార్యక్రమంలో పాకాల లక్ష్మీ నారాయణ,చేరుకూరు శ్రీనివాసులు పాల్గొన్నారు.

Featured

క్యాన్సర్ ఆసుపత్రికి రూ.5 లక్షల విరాళం

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ నెల్లూరు పొదలకూరు రోడ్డులో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ క్యాన్సర్ ఆస్పత్రికి వీఆర్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు టీవీ కృష్ణా రెడ్డి రూ.5 లక్షల విరాళ్ళని అందించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని పోర్దాలో ఉండటంతో సమీప బంధువు ద్వారా ఈ విరాళ్ళని అందచేశారు. మానవతా దృక్పథంతో క్యాన్సర్ రోగులకు అండగా నిలిచిన దాతకు ఆసుపత్రి కన్వీనర్ తుంగాశివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతతో తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.