Thursday, 9 July 2026

Blog

ప్రకాశం

చిన్నారుల మృతదేహాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

పొదిలి ప్రభుత్వ వైద్యశాల లో సోమవారం ఉదయం కొనకనమిట్ల మండలం అంబాపురం గ్రామంలో నీటి కుంటలో పడి మృతి చెందిన ఇద్దరు చిన్నారుల మృత దేహాలను సందర్శించి వారి కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి.

ప్రకాశం

మంచి నీటి చెరువులను సాగర్ నీటితో నింపండి – మంత్రి బాలినేని

ఒంగోలు పట్టణంలో ప్రస్తుతం 1 వ సమ్మర్ స్టోరేజి చెరువు నందు 668ml, 2వ సమ్మర్ స్టోరేజి చెరువు నందు 1556ml అందుబాటులో ఉన్నాయి. రామతీర్థం రిజర్వాయర్ ద్వారా ప్రస్తుతం చెరువులకు మంచి నీరు వచ్చి చేరుతుంది. ఇంకా 20 రోజులు రామతీర్థం రిజర్వాయర్ నుండి మంచి నీరు వస్తే చెరువులు పూర్తి స్తాయిలో నిండుతాయి. 3 నెలలు 20 రోజుల పాటు వస్తాయి. ప్రస్తుతానికి ఉన్న నీళ్లు 2 నెలల పాటు వస్తాయని ఒంగోలు మున్సిపల్ ఇంజనీర్ దేవరపల్లి సుందర రామిరెడ్డి వివరణ ఇచ్చారు. మంత్రి గారి ఆదేశాలు మేరకు చెరువులను పూర్తి స్తాయిలో నింపుతాం. నగరంలో ప్రజలకు మంచి నీరు కష్టాలు రాకుండా చూస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్

వసప క్వారంటైన్ సెంటర్ లో భోజనంలో ఇసుక

కొత్తూరు :మండలంలోని వసప కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహంలో యర్పాటు చేసిన వలస కార్మికుల క్వారంటైన్ సెంటర్లో నాసిరకం భోజనం అందిస్తూ ఎంతో ప్రయసపడి వచ్చిన వారిని అదరించకపోగా దుర్బాష లు ఆడుతున్నారు, సోమవారం ఉదయం భోజనం లో భాగం గా పులిహోర పెట్టగా చాలీ చాలని దానితో పొట్ట నింపుకొంటామని అనుకున్న వారికి భోజనంలో ఇసుక వచ్చింది దీనిపై పలువురు అడగగా ఉంటే ఉండండి లేదు అంటే వెళ్లిపోంది అని సిబ్బంది అంటున్నారు రని  ,తలుపులు  వేసి తాళాలు వేశారని తెలుపుతున్నారు

ప్రకాశం

ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ కే సొంతం

ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపాలెంలో నూతనంగా నిర్మించిన దర్శి-2 సచివాలయాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన అన్ని సచివాలయాలు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జగనన్న సారథ్యంలో ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలోనే లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక్క జగన్​కే దక్కుతుందని కొనియాడారు. సచివాలయాలు అవినీతి రహితంగా ప్రజలకు విశ్వాసం కలిగించేలా ఉండాలని ఉద్యోగులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్

ప్రతి ఇంటా ” కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్” మొబైల్ యాప్

శ్రీకాకుళం : ప్రతి ఇంటా ” కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్” మొబైల్ యాప్ ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 వ విడత ఇంటింటి ఫీవర్ సర్వేలో  భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా కోవిడ్ 19 ఆంధ్ర ప్రదేశ్ యాప్ ను ఆశా కార్యకర్త, ఏ.ఎన్.ఎం ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తూ  స్వయంగా డౌన్ లోడ్ చేయాలని పేర్కొన్నారు. సర్వే సమయానికి ముందు రోజు ఫీవర్  సర్వే గురించి ప్రజలందరికీ తెలియజేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలు అందరూ అందుబాటులో ఉండే సమయాలలో సర్వే నిర్వహించాలని తద్వారా మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.  సర్వే కార్యక్రమాన్ని ఆయా ప్రాంత ఆశా కార్యకర్త,ఏ.ఎన్.ఎం స్వయంగా నిర్వహించాలని తెలిపారు. వాలంటీర్ సర్వేలో పాల్గొని తమ మొబైల్ ఆప్ ద్వారా ఆశా, ఏ.ఎన్.ఎం చెప్పిన వివరాలు నమోదు చేయాలని అన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని గమనించాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా మలేరియా,డెంగీ వంటి వ్యాధులను గూర్చి అవగాహన కలిగించి, నివారణ చర్యలు తీసుకొనే విధంగా చైతన్య పరచాలని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనే సిబ్బంది విధిగా మాస్కు ధరించి, తగిన ఇతర రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి సర్వే వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సర్వే వివరాలు నేరకుగా మోబైల్ యాప్ ద్వారా ప్రతి ఇంటి సర్వేలో భాగంగా ఆ ఇంటి వద్దనే అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. తాళాలు వేసిన ఇళ్ళు ఉంటే వదిలి పెట్టరాదని, ఇంటి మనుషులు వచ్చిన వెంటనే అప్ లోడ్ చేయాలని సూచించారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా సహనం, ఓర్పుతో సర్వే చేపట్టి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ నివాస్

శ్రీకాకుళం జిల్లాలో నేటి ఆదివారం కరోనా హెల్త్ బులిటెనను జిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. మొత్తం 45601 మంది నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా..39580 మందికి రిపోర్టులు నెగిటివ్ వచ్చాయని చెప్పారు. ఇంకా 6021 మంది రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు.అదివారం 1937 మంది నమూనాలను పంపినట్లు తెలిపారు.ఈ రోజు కొత్తగా కేసులు నమోదు కాలేదన్నారు.కాగా ప్రస్తుతం ఐదుగురు డిశ్చార్జి అయ్యి 9మంది చికిత్స పొందుతున్నారు

చిత్తూరు

చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

అట్టహాసంగా.. * చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం * నిబద్ధత, అవగాహన కలిగిన పాలక మండలి * ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి   తిరుపతి,   చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో అట్టహాసంగా సాగింది. మార్కెట్ యార్డ్ చైర్మెన్ గా మస్తాన్, ఉపాధ్యక్షులుగా కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో పద్నాలుగు మంది సభ్యులచే గౌరవ అధ్యక్షులు హోదాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదివారం మార్కెట్ యార్డ్ వేదికగా పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. రైతు సమస్యలపై అవగాహన, పరిష్కరించడంలో నిబద్ధత కలిగిన సభ్యులు పాలకమండలి లో ఉన్నారని తెలియజేశారు. రాష్ట్రంలోనే చంద్రగిరి మార్కెట్ యార్డ్ అతి త్వరలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతే రాజు దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎర్ర వారిపాలెం, చిన్నగొట్టి గాల్లు, చంద్రగిరి మండలాల పరిధిలోని రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని పాలక మండలి సభ్యులకు తెలియజేశారు. రైతులకు 24×7 అందుబాటులో ఉంటారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి ని పాలకమండలి చైర్మెన్ మస్తాన్, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి నాగలిని బహూకరించి, గజమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పూర్తితో రైతులకు సేవలు అందిస్తామని నూతన పాలకమండలి సభ్యులు స్పష్టం చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే చెవిరెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సహదేవ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీవో రాధ తదితరులు పాల్గొన్నారు.

Featured

బిజెపి మనుబోలు మండల నూతన అధ్యక్షుడుగా ఓడూరు శ్రీనివాసులు రెడ్డి

31-05-2020మనుబోలు ( పున్నమి ప్రతినిధి)తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీ.సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి అధ్యక్షతన మనుబోలు మండలం గోవిందరాజపురం గ్రామంలో బిజెపి మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనుబోలు మండల బిజెపి అధ్యక్షుడిగా ఓడూరు శ్రీనివాసులురెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మండల స్థాయిలో బిజెపి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు తనను బిజెపి మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల నాయకులకు కార్యకర్తలకు తన కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ నాయకులు అందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని మనుబోలు మండలం లో గ్రామస్థాయిలో బలోపేతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మనుబోలు మండల ప్రధాన కార్యదర్శి పట్నం వీర ప్రతాప్ మరియు మనుబోలు మండల బిజెపి నాయకులుచల్లా లక్ష్మయ్య ,దగ్గవోలు రామిరెడ్డి ,ముప్పవరపు చిన్న, ఇరగ రాజ అంకయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured

మినగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో 300కుటుంబాలకు కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ..

31-05-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో షుమారు 300కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే త్రాగు నీరు, మజ్జిగ చలివేంద్రం కూడా ప్రారంభోత్సవం జరిగింది. మినగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వెంకటరమణ దాతగా వ్యవహరించారు. చలివేంద్రం ప్రారంభించిన అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని.. భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు అమర్నాథ్ రెడ్డి, శేఖర్, ఏకొల్లు శ్రీనివాసులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.