Thursday, 9 July 2026

Blog

హెల్త్ టిప్స్

రోబోతో కరోనా సేవలు

పలమనేరు జూన్1,2020(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని మొరం గ్రామం చెందిన యువ శాస్త్రవేత్త పవన్ కుమార్ చాలా ప్రయోగాలు చేసాడు. తాజాగా మరో అద్భుతం సృష్టించాడు. దేశ వ్యాప్తంగా కరోన వైరస్ అలాడుతున్నదన్నారు కరోన రోగులకు సేవలు అందించేందుకు అందరూ భయపడుతున్నారు.కరోన రోగులకు వైద్యం చేయడానికి, వారికి మందులు ఇవ్వడానికి వైద్యులు ఇక భయపడవలసిన పనిలేదని శాస్త్రవేత్త పవన్ కుమార్ అంటున్నారు ఇందుకోసం తాను ఒక రూపం తయారు చేసినట్లు తెలిపారు తయారు చేసిన రోబో ను పలమనేరు పట్టణంలోని ఈమాస్ లెప్రసీ ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా పని చేయించారు.కారోనా సోకిన రోగులు దగ్గరికి ఆస్పత్రి సిబ్బంది వెళ్లి పని ఉండదన్నారు . అందులోని ప్రోగ్రాం ప్రకారం రోబోనే నేరుగా వెళ్లి మందులు అందిస్తుందని తెలిపారు. అంతేకాకుండా నిర్ణిత దూరం నుంచి రోగికి అవసరమైన వాటిని అందించి ఫోటో తీసుకుందని తెలిపారు. కరోనా రోగికి చికిత్స సమయంలో మందులు, భోజనం రిమోట్ ద్వారా రోబో చేతులతో అందించే ఏర్పాటు చేసుకోవచ్చున్నారు.త్వరలో ఒక రోబోను తిరుపతి రుయా ఆస్పత్రికి ఇవ్వాలనుకుంటున్నాను అని ఆయన తెలిపారు.

ప్రకాశం

ఉలవపాడు లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

ఉలవపాడు మండలంలో మరో రెండు కరోన పాజిటివ్ కేసులు నమోదు. ఉలవపాడు లో ఒకరికి, కరేడు లో మరొకరికి టెస్ట్ ల ద్వారా నిర్ధారణ కాగా, ఉలవపాడు లో వచ్చిన వ్యక్తి ఉలవపాడు రాక ముందే సూరత్ నుండి వస్తున్న సమయంలో ఒంగోలు క్వారంటైనే లో ఉంచి పరీక్షలు జరిపారు. దీని వలన గ్రామంలో అధికారులకు, గ్రామస్తులుకు కాస్త ఊరట లభించింది.

Featured

సచివాలయంలోనే మీసేవలు

సచివాలయంలోనే మీసేవలు పలమనేరు,జూన్1(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని గ్రామ సచివాలయంలో మీసేవలు అందుబాటులోకి వచ్చాయని ఎంపిడిఓ విద్యాసాగర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ సచివాలయంలో ద్వారా ఇక నుండి మీసేవ అందుబాటులో వచ్చని ప్రజలందరూ రూ.15 రుసుము చెల్లించి వారికి అవసరమైన సేవలు రెవిన్యూ సర్వీసులు ఆధార్ ఈకెవైసి కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికెట్, పట్టాదారు పాసు పుస్తకం,ఫ్యామిలీ మెంబెర్,ఈ సి,బర్త్,డెత్ ,మొదలగు సేవలు పొందవచ్చున్నారు.

Featured

మితిమీరిన వేగం అత్యంత ప్రమాదకరం

పలమనేరు జూన్1,2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణ సమీపంలోని కేటీల్ ఫారం పలమనేరు- కుప్పం రహదారి గుండా వెళ్లే వాహనాలను ఏఎస్ఐ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. అతి వేగంతో ప్రయాణిస్తున్న వాహనాలను అపి జరిమానాలు వేశారు. అలాగే ఓవర్ లోడ్ తో వెళుతున్న ఆటోలకు కూడా జరిమానాలు విధించారు. ఏఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ… ద్విచక్ర వాహనం నడిపే చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలాగే కారులో ప్రయాణించే సమయంలో డ్రైవర్ తో పాటు ప్రయాణికులు సీటు బెల్టు ధరించాలని సూచించారు. అతి వేగంతో వాహనం నడిపితే ప్రమాదం తప్పదన్నారు.అతి వేగంతో వాహనం నడిపితే ప్రమాదం తప్పుదన్నారు. అధిక శాతం ప్రమాదాలు మితిమీరిన వేగంతో జరిగినట్లు చెప్పారు. మీరు క్షేమంగా ఇంటికి వెళితే కుటుంబంతో సంతోషంగా ఉంటుందని భావన కలగాలన్నారు. ప్రమాదం తగ్గించాలనే లక్ష్యంతో నే వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

గూడూరు

అప్పాచి విధులకు వెలుతున్న కార్మికులను అడ్డుకున్న గ్రామస్తులు

నెల్లూరు జిల్లా తడ మండలం చేనిగుంట గ్రామంలో అపాచీ కంపెనీకి వెళ్తున్న కార్మికులను ఆ ఊరి గ్రామస్తులు అడ్డుకుని కరోనా నేపద్యంలో విధులకు ఎవరు వెళ్ళద్దని మన ఊరి చూట్టు ప్రక్కల కరోనా ఉందని దయచేసి కంపెనీలకు ఎవరు వెళ్లద్దు అని చెప్పి కార్మికులను పంపించివేసారు.ఈ విషయం గురించి గ్రామ mptc చంద్ర గారు  మాట్లాడుతూ ఎవరు ఇంటి నుండి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలి అని చెప్పారు, ఇందుకు సహకరించిన మన ఊరి వాళ్ళందరికి ధన్యవాదలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

బైరిదేశిగెడ్డ శివారు భూములకు సాగునీరు అందించాలి

శ్రీకాకుళం :  భైరిదేసిగెడ్డ శివారు భూములకు కూడా సాగునీరు అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆదేశించారు. శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఉపాధి హామీ పథకం అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ప్రకాశం

వెలిగొండ ప్రాజెక్టు ను సందర్శించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

వేలుగోండ ప్రాజెక్టు హేడ్ రేగ్యూలేటర్ పనులు కోళ్లం వాగు దగ్గర పరిశీలించిన ఇరిగేషన్ మినిష్టర్ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ. అనిల్ కుమార్ యాదవ్ మరియు శ్రీ. డా.ఆదిమూలపు సురేష్ మరియు అధికారులు.

ప్రకాశం

పంచాయతీ కార్మికులకు కు భోజనం పంపిణీ చేసిన జబర్దస్త్ ఫేమ్ నెమలి రాజు

పొదిలి పట్టణంలో పెన్ పవర్ ఆధ్వర్యంలో సోమవారం పంచాయతీ కార్మికులకు నిర్వహించే భోజనాలకు జబర్దస్త్ ఫేమ్ నెమలి రాజు ఆర్ధిక సహాయం అందజేశారు. అందులో భాగంగా 61 వ రోజు ఆయిన సోమవారం స్వయంగా వచ్చి వడ్డించారు. సాధారణ భోజనంతో పాటు స్పెషల్ లడ్డు, బూందీ, అరటిపండు, అప్పడం స్వయంగా వచ్చి వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరులు , స్నేహితులు పాల్గొన్నారు.

ప్రకాశం

మేముఉన్నాము సేవాసంస్థ ఆధ్వర్యంలో ఒక మహిళకు రక్తదానం చేసిన యువకుడు

గిద్దలూరు పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో గిద్దలూరు మండలం పొడలకొండపల్లె గ్రామానికి చెందిన ఆగోలు శివనాగార్జున యాదవ్ అనే యువకుడు మేము ఉన్నాము సేవసంస్థ ఆధ్వర్యంలో సోమవారం రక్తదానం చేశారు. వివరాల్లోకి వెళితే ఓ మహిళకు అత్యవసర పరిస్థితుల్లో O+ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో మేమున్నాం సేవాసమితి ద్వార విషయం తెలుసుకున్న ఆగోలు శివనాగార్జున యాదవ్ రక్త దానం చేశారు. ఆపత్కాలంలో, స్పందించినందుకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేమున్నాం సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

ప్రకాశం

పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

  పొదిలిలోని పొగాకు వేలం కేంద్రంను సోమవారం ఉదయం సందర్శించి రైతుల సమస్యను వేలం సూపరింటెండెంట్ దృష్టికి తీసుకొని వెళ్లిన మార్కాపురం మాజీ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.