Tuesday, 14 July 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వాజ్పేయి సేవలు మహోన్నతం

ఆగస్టు 16 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటరీ కాట్రేనికోన మండలం చెయ్యరు లో మండల అధ్యక్షుడు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కోట్లాదిమందికి మార్గదర్శి స్ఫూర్తిదాత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అవార్డు గ్రహీత *శ్రీ అటల్ బిహారి వాజ్పేయి వారి వర్ధంతి* సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పువ్వు లు సమర్పించి నివాళులు సమర్పిస్తూ ఆమహనీయుడని స్మరించుకోవడం జరిగింది… ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు. బిజెపి జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ జిల్లా డైరెక్టర్ సూరిబాబు. ఎస్.నాగేశ్వరరావు టి.నారాయణస్వామి ,కె.బలరాం, ఎన్.వెంకటేశులు, జి .చంటి,. సిహెచ్. సత్యనారయణ, పి. ముత్యాలరావు, తదితరులు పాల్గొనడం జరిగింది…

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

79వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపి ణీ గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారిని భరతమాతగా ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది.

అనంతరం సాయంత్రం దేశ శాంతిభద్రతల రక్షణ కొరకు ఆలయ అర్చకులు ఆణి విళ్ళ ఫణికాంత్ శాస్త్రి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ఉదయం 8గంటలకు అధ్యక్షులు ఆణి విళ్ళ సాయిబాబా, రాష్ట్ర బిజెపి కోశాధికారి. గ్రంధి నానాజీ,సుంకరబుజ్జి, తాతపూడి గోపి, సంసాని పాండురంగారావు, దొమ్మేటి ఫణీంద్ర,సుంకర పవిత్ర గ్రంధి శ్రీను ఆణివిళ్ల వాసు, ఎల్లమిల్లి రమేష్,కొత్తగుండు భాస్కరరావు,గ్రంధిసత్తిబాబు,రామకృష్ణపరమహంస, తదితరులు పాల్గొని జెండా వందనం చేశారు. విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు మరియు చాక్లెట్లు ఇవ్వడం జరిగింది. భరతమాతగా జెండా అలంకరణలో మావుళ్ళమ్మ తల్లి అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు

ఆంధ్రప్రదేశ్

ముమ్మిడివరం లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

ముమ్మిడివరం మండలం లో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. గ్యాప్ ఇవ్వకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తడుచుకుంటూనే తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు రద్దీ ఎక్కువగానే ఉంది. ఈ భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిసింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

*ఉత్తమ ఉద్యోగిగా అవినాష్ కు ప్రశంసా పత్రం..*

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ వా వి రాల మహేష్ కుమార్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసా పత్రం అందజేశారు. తన విధుల్లో నిబద్ధత, కృషి, ప్రతిభ ప్రదర్శనకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ఈ సందర్భంగా కాట్రేనికోన ఎస్సై అవినాష్ సహచరులు, పోలీసు శాఖ అధికారులు, స్నేహితులు, మండల గ్రామ ప్రజలు అభినందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కుండలేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకున్న బిజెపి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు

ఆగస్టు 17 కాట్రేనికోన దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రాన్ని ఏపీ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి కుటుంబ సభ్యులతో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి కామేశ్వర శర్మ ఆలయ విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం చేసి శాలువ కప్పి సత్కారం చేశారు,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కోశాధికారి గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి సూచించారు,ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు,మోదీ దేశ రక్షణ,అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు.రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు….

కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రా బీసీ సెల్ సెక్రెటరీ బాలు యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ ఆరాధ్య కుల దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో స్థానిక యువకులు రక్తదానం చేయగా, పలువురు బాలు ప్రయత్నాన్ని అభినందించారు. ఉదయం శ్రీకృష్ణ పూజతో మొదలైన వేడుకలలో చిన్నారులు ప్రదర్శించిన మురళి కోలాటం భక్తులను మంత్రముగ్దలను చేసి విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో ఈ వేడుకల్లో కాట్రేనికోన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, చెయ్యేరు సొసైటీ అధ్యక్షులు చవటపల్లి శ్రీను, చెయ్యేరు సర్పంచ్ చెల్లి సురేష్, ఉపసర్పంచ్ నారాయణ మూర్తి (సియం), నంద్యాల వెంకన్న బాబు బిజెపి నాయకులు గ్రంధి నానాజీ మట్ట సూరిబాబు మట్ట శివకుమార్ జిల్లా యాదవ్ సంఘం గౌరవ అధ్యక్షులు కోరశిఖ సుబ్రహ్మణ్యం మాస్టారు, మట్టా రాంబాబు, జిల్లా మీడియా సెల్ అధ్యక్షులు కానుబోయిన దుర్గాప్రసాద్, కోరిశిఖ రాము తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

వివాహ వేడుకలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు గల్లా

పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఖమ్మం జిల్లా పరిధిలో ని బోనకల్ మండలం లో గల ఆళ్ళ పాడు లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవక్ సోదరుని వివాహ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించారు. వీరి వెంట జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్, టి సురేష్ , రాఘవ స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

అపార్’ తప్పనిసరి..!

బోర్డ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్కు ఐడీలను సమర్పించాలి- సీబీఎస్ఈ తాజా నిర్ణయంపై వివాదం – సమాచార భద్రత, గోప్యతపై – నిపుణులు, మేధావుల ఆందోళన న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీసుకున్న తాజా నిర్ణయం వివాదమవుతున్నది. సీబీఎస్ఈ విద్యార్థులు పది, 12వ తరగతుల బోర్డు పరీక్షలకు నమోదు చేసుకునేటప్పుడు అపార్ ఐడీలను సమర్పించటం తప్పనిసరి చేసింది. ఇప్పుడు ఈ నిర్ణయంపై అందరిలోనూ అనుమానాలు, ఆందోళనలు కలుగుతున్నాయి. ముఖ్యంగా డేటా భద్రత, వ్యక్తిగత గోప్యతకు సంబంధించి తీవ్ర చర్చ నడుస్తున్నది. *అపార్ అంటే..?* ఆధార్ తరహాలో విద్యార్థుల కోసం తీసుకొచ్చిందే అపార్. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీనిని సంక్షిప్త రూపం అపార్. ఇది 12 అంకెలతో ఐడీని కలిగి ఉంటుంది. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ద్వారా అపార్ను ప్రవేశపెట్టారు. ఇది విద్యార్థి ఎన్రోల్మెంట్కు అనుసంధానించబడిన ఒక గుర్తింపు సంఖ్య. ఇందులో విద్యార్థికి సంబంధించిన విద్యా వివరాలు ఉంటాయి. అంటే విద్యార్థి ఎల్కేజీలో చేరినప్పటి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు సంబంధించిన సమాచారం అందులో ఉంటుంది. అంటే ఎడ్యుకేషనల్ స్కోర్స్, విజయాలు, సంబంధిత గణాంకాలు వంటివి ఉంటాయి. ఇది ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ప్లాట్ఫామ్ డిజిలాకర్ ద్వారా విద్యార్థుల రిపోర్ట్ కార్డులు, రికార్డులను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.అపార్ ఐడీ నకిలీ విద్యా సర్టిఫికెట్లను అంతం చేస్తుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. సీబీఎస్ఈ చర్యపై నిపుణులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇది గోప్యతకు భంగం కలిగించే ప్రమాదము ఉన్నదని వాదిస్తున్నారు. ఇందుకు వారు ‘ఆధార్’ను ఉదాహరణగా చూపుతున్నారు. ఆధార్ ద్వారా జరిగిన గోప్యత, వ్యక్తిగత సమాచార ఉల్లంఘనలను గుర్తు చేస్తున్నారు. అపార్ ఐడీని తప్పనిసరి చేయటం ద్వారా వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రత, స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ఆరోపిస్తున్నారు. తాజా పరిణామంపై సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ (ఎస్ఎఫ్ఎల్సీ) వ్యవస్థాపకురాలు మిషి చౌదరి స్పందించారు. భారతీయులను ప్రతీరోజూ కొత్త గుర్తింపు పత్రాలను అడుగుతున్నారని తెలిపారు. ‘మొదటగా ఆధార్ అన్నారు, ఇప్పుడు చిన్నారులను అపార్తో ముడిపెడుతున్నారు. తల్లిదండ్రులను వేధిస్తున్నారు. అపార్కు చట్టబద్ధత లేదు’ అని మిషి చౌదరి తెలిపారు. ఇటు నిపుణులు, మేధావులు, తల్లిదండ్రుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో సీబీఎస్ఈ ఈ నిర్ణయంపై ఇంకా స్పందించాల్సి ఉన్నది. 2023లో కేంద్రం ప్రారంభించిన ‘వన్ నేషన్, వన్ స్టూడెంట్’ పథకం కింద పాఠశాలలు తమ వార్డుల అపార్ ఐడీలను సృష్టించడానికి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకోవాలని విద్యా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అపార్ ఐడీని పొందటానికి ఒక విద్యార్థి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, ఆధార్ నెంబర్తో సహా తన వ్యక్తిగత వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్

ఈసీ విశ్వసనీయతకు పరీక్ష!

ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి: మన దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎం. ఎస్.గిల్ ఉన్నప్పుడు విదేశీయుల నుంచి ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. ‘మీరు ప్రకటించే ఫలితాలను పార్టీలన్నీ అంగీకరిస్తాయా?’ అని అడిగినవారికి- ‘భారత ఎన్నికల సంఘం పట్ల ఎప్పుడూ ఎవరూ ఎలాంటి విశ్వాసరాహిత్యాన్నీ ప్రదర్శించలేదు’ అని గిల్ సగర్వంగా సమాధానమిచ్చారు. ఈసీ మీద అంతటి నమ్మకం ఇప్పుడు ఉందా అంటే- రాజకీయ పార్టీలే కాదు, ప్రజల్లో కూడా చాలామంది ‘లేదు’ అనే చెబుతారు. బిహార్ లో ఓటరు జాబితాల నిశిత పరిశీలన (ఎస్ఐఆర్) ప్రహసనం ప్రారంభమయ్యాక- కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై కొన్నేళ్లుగా వ్యక్తమవుతున్న అనుమానాలు ఆందోళనలుగా పరిణమించాయి. ఆ రాష్ట్ర ముసాయిదా ఓటర్ల లిస్టులోంచి తొలగించినవారి వివరాలను ప్రత్యేకంగా వెల్లడించనక్కర్లేదని, జాబితాలో ఎవరినైనా చేర్చకపోవడానికి కారణాలేంటో కూడా చెప్పక్కర్లేదని ఈసీ వాదించడంతో సందేహాలు ఇంకా బలపడ్డాయి. ప్రజలపై ప్రభావం చూపించే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలనూ బహిరంగపరచాలని సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(సి) నిర్దేశిస్తోంది. పాలనాపరమైన, అర్ధన్యాయ తీర్మానాలకు గల కారణాలేంటో ఆ నిర్ణయాల ప్రభావాలకు లోనయ్యే వ్యక్తులకు వివరించాలని సెక్షన్ 4(1)(డి) స్పష్టీకరిస్తోంది. ప్రజాస్వామ్యానికి ఊపిరులూదే ఇటువంటి జవాబుదారీతనాన్ని కాలదన్నిన ఈసీకి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు కనువిప్పు కలిగించేవే! బిహార్ ముసాయిదా జాబితా నుంచి తొలగింపునకు గురైన 65 లక్షల మంది వివరాలను బయటపెట్టాలంటూ మొన్న గురువారం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విశేషమైనది. ఓటర్ల లిస్టులోంచి తమను ఎందుకు తీసేశారో తెలుసుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు, ‘సుప్రీం’ ఉత్తర్వులు దానికి పట్టంకట్టాయి. ఓటింగ్ హక్కును అమూల్యమైనదిగా గతంలో పేర్కొన్న కేరళ హైకోర్టు- సంబంధిత వ్యక్తుల వాదనలను వినకుండా ఎవరి పేర్లనూ ఓటరు జాబితాలోంచి కత్తిరించకూడదని స్పష్టంచేసింది. వ్యక్తిగత అంతరాలకు అతీతంగా పౌరులందరూ ప్రజాస్వామ్యంలో కీలక పాత్రధారులే. కాబట్టి ప్రతి ఒక్కరి ఓటూ విలువైనదే. కండబలంతో, అధికార దుర్వినియోగంతో ఎవరూ ఎన్నికల ప్రక్రియను దారితప్పించకూడదు. ప్రజాభిప్రాయ ప్రకటనను తమకు అనుకూలంగా ప్రభావితం చేయకూడదు. ఈ మేరకు గతంలోనే ఉద్ఘాటించిన న్యాయపాలిక- ఎన్నికలు స్వేచ్చగా సక్రమంగా పూర్తికావడం ప్రజాతంత్రానికి ప్రాణావసరమని పేర్కొంది. ఎలక్షన్లు ఆ విధంగా జరగాలంటే- ముందసలు ఓటర్ల లిస్టులు సక్రమంగా ఉండాలి. వాటిని అలా రూపొందించడంలో ఈసీ ఎప్పటికప్పుడు చేతులెత్తేస్తుండటమే దేశ ప్రారబ్ధం! అన్ని పార్టీలకూ సమదూరంలో ఉంటూ పారదర్శకంగా పనిచేయడం- ఈసీ శిరసావహించాల్సిన సంవిధాన కట్టుబాటు. ఎన్నికల సంఘం చేతల్లో రాజీలేని స్వతంత్రత, నిష్పాక్షికత, నిజాయతీ ఉట్టిపడాలి. ఎన్నికల నిర్వహణకుగానూ తనకు దఖలుపడిన సర్వాధికారాల వినియోగంలో యుక్తాయుక్త విచక్షణతో వ్యవహరించాలి. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా దేశీయంగా అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల లిస్టులోంచి అర్హుల పేర్లు గల్లంతు కావడం, అనర్హులు వచ్చిచేరడం వంటి అక్రమాలు నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి. అంగ, అర్థ బలసంపన్నుల క్రీడామైదానాలుగా మన ఎన్నికలు పరువుమాస్తున్నాయి. ఈసీ చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు భారత ప్రజాస్వామ్యాన్ని ఇంకా పలుచన చేస్తున్నాయి. నైతిక నియమాలు, శాసన నిబంధనలకు కట్టుబడి విధులు నిర్వర్తించడంలో ఈసీ నిబద్ధతే ఎన్నికల ప్రక్రియ పవిత్రతను పరిరక్షిస్తుంది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థకు రాజకీయ మకిలి అంటితే మన ప్రజాస్వామ్యం అర్థరహితమై ఆరాచకాలకు ఆలవాలమవుతుంది!

E-పేపర్

జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలినంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు 08514-293903 జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఈదురు గాలులు, మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించిందన్నారు. ఈ మేరకు వర్షాల సహాయక చర్యల నిమిత్తం నంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబరు 08514-293903 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కంట్రోల్ రూమ్ 24-7 ప్రకారం పనిచేస్తుందన్నారు. ఏదేని అనుకోని అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే పైన తెలిపిన కంట్రోల్ రూమ్ నంబరుకు ఫోన్ చేయవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఆర్డీవో కార్యాలయాలు, తాసిల్దార్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రైతులు వారికి సంబంధించిన పంటలు, ధాన్యము, పశు సంపదను సురక్షితంగా కాపాడుకునే చర్యలు చేపట్టాలి. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా నీరు ప్రవహించే కల్వర్టుల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాలన్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్దంగా ఉంచుకోవాలని వైద్యశాఖాధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.