Tuesday, 14 July 2026

Blog

అన్నమయ్య

సోషల్ మీడియాలో అనుమానాస్పద లింక్స్‌ పట్ల జాగ్రత్త – చిట్వేల్ ఎస్ఐ నవీన్ హెచ్చరిక

చిట్వేల్ ఎస్ఐ నవీన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వాట్సాప్‌, సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయవద్దని సూచించారు. ఉచిత రీఛార్జ్‌, బంపర్ ఆఫర్‌, బహుమతుల పేర్లతో వచ్చే లింక్స్‌ పూర్తిగా మోసపూరితమని, వాటి ద్వారా వ్యక్తిగత డేటా, బ్యాంక్ వివరాలు దొంగిలించే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి లింక్స్‌ను క్లిక్‌ చేయడం మాత్రమే కాకుండా ఇతరులకు ఫార్వార్డ్‌ చేయరాదని కూడా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, సైబర్ మోసగాళ్లకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అన్నమయ్య

కార్యకర్తల సమస్యల పరిష్కారం నా బాధ్యత – కస్తూరి విశ్వనాథ నాయుడు హామీ

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం పెనగలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆగస్టు 17న ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు కార్యకర్తల సమస్యలను విని వెంటనే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మండలంలో వారానికి రెండు మూడు రోజులు పర్యటిస్తూ కార్యకర్తల సమస్యలను నేరుగా విని సంబంధిత అధికారులతో చర్చించి తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే కలెక్టర్‌, మంత్రివర్యులు, చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అయినా పరిష్కారం సాధిస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తల కృషి వలననే తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేసిన ఆయన, కాబట్టి ఎవ్వరూ అధైర్య పడవద్దని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

విద్యార్థి మరియు ప్రజా సంఘాల హక్కులను హరించే ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి

విద్యార్థి మరియు ప్రజా సంఘాల హక్కులను హరించే ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి RC.No – 30/67/2025 Dated (01-08-2025) ఆదేశాలను ప్రభుత్వం రద్దు చేయాలి విద్యార్థుల సమస్యలు బయటకి రాకుండా ఉండేందుకే పాఠశాలల్లోకి ప్రజా సంఘాల ప్రవేశాన్ని నారా లోకేష్ నిషేధించడం యస్సీ యస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి పాఠశాల ఆవరణలోకి విద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాల ప్రవేశాన్ని నిషేదిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేసుకోవాలని యస్సీ యస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను బయటకు రాకుండా చేయాలన్నా కుట్రతోనే ప్రభుత్వం ఇలాంటి నియంతృత్వ పోకడలతో ఆదేశాలు జారీ చేసిందని ఆమె అన్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ సమస్యలపై గట్టిగా పోరాడండి అంటూ అందరిని ప్రోత్సహించి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతృత్వ ధోరణితో హక్కులను కాలరాస్తూ జారీ చేసిన ఆదేశాలను చూస్తే కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగా పాలనను సాగిస్తుంది అని ఆమె తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే జీ.వో లు తీసుకువస్తే విద్యార్థి ప్రజా సంఘాలు స్వాగతిస్తారు కానీ ఇలాంటి పనికిరాని జీ.వోలను,ఆదేశాలనుహర్షించరు పి ఆమె అన్నారు. విద్యార్థి మరియు ప్రజా సంఘాల హక్కులను హరించే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనికూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా ఐక్యవేదిక రాయలసీమ డివిజన్ అధ్యక్షురాలు ఈడిగ భారతమ్మ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ ,జిల్లా ఉపాధ్యక్షురాలు హుస్సేన్ బి ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షురాలు ఎలిశమ్మ ఎమ్మిగనూరు మండల అధ్యక్షురాలు ఈరమ్మ,గోనెగండ్ల మండల అధ్యక్షురాలు ఖాసింబి పాల్గొన్నారు

హైదరాబాద్

బిజెపి రాష్ట్ర కమిటీ సమావేశం..

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రాంచందర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని, ఘన విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి, అనుసరించాల్సిన వ్యూహాలను గురించి బిజెపి ముఖ్య నాయకులకు రామ చందర్ది రావు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి డా. కాసం వెంకటేశ్వర్లు , బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొల్లి మాధవి హాజరయ్యారు.

E-పేపర్

రాష్టం లో విధి కుక్కలసైర్యావిహారం చేస్తున్నాయి దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకువాలని ముస్లిం హక్కులపోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి smd యూనుస్ డిమాండ్

రాష్టం లో విధి కుక్కలసైర్యావిహారం చేస్తున్నాయి దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకువాలని ముస్లిం హక్కులపోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి smd యూనుస్ డిమాండ్ చెయ్యడం ఆయన మాట్లాడుతూ కుక్క ఎన్జీవోస్ కుక్కలని చెప్పడం నేరమంటున్నారు మరి అదే కుక్కలు మనుషులు మీద కరిగే మనుషుల ప్రాణాలు తీస్తుంటే కుక్కల ప్రేమికులు ఎందుకు మాట్లాడడం లేదు మనుషుల కంటే కుక్కలు ఎక్కువ పోయిన వాళ్లకి అటువంటప్పుడు కుక్కలను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకోవాల అవసరం ఉన్నాయి ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర సెక్రటరీ సయ్యద్ గులాబ్ మాట్లాడుతూ అధికారులు వెంటనే ద్రుష్టి సరించి కుక్కలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది కర్నూలు జిల్లా గౌరవ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రజలప్రాణాలు కాపాడాలని అధికారులను కోరడమైనది ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు కరటే మాబాషా మాట్లాడుతూ నంద్యాల లో రెక్కి నిర్వహించడంతో కుక్కల బెడద ఎక్కువ ఉండటం తో రాష్ట్ర కమిటీని సంప్రదించి అధికారులకు కుక్కలబెడద పై చర్యలు తీసుకువాల్సిందిగా కోరడం జరిగింది

ఖమ్మం

రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తం

పురపాలక సంఘం కార్యాలయనికి కూత వేటు దూరంలో గల రోడ్ల పరిస్థితి గుంతల మయం పాఠశాలలకు వాహనదారులకు ఇబ్బందికరంగా మారిన రోడ్లు ఖమ్మం పురపాలక సంఘంలో 53వ డివిజన్ నిత్యం రద్దీగా ఉండే గట్టయ్య సెంటర్ నుండి కవిత కాలేజ్ వరకు అక్కడక్కడ గుంతలు పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది అలాగే పాత వెంకటేశ్వర థియేటర్ ప్రసాద్ హైట్స్ నుండి మెయిన్ రోడ్ వరకు కృషి భవన్ వరకు రోడ్లు చెదిరిపోయి గుంతలు పడి పాఠశాలకు వాహనదారులకు ఇబ్బందికరంగా ప్రమాదకరంగా మారిందని 53వ డివిజన్ భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు తొడుపునూరి రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి కార్పొరేషన్ అధికారులు వెంటనే రోడ్ల మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు

తిరుపతి

కానిస్టేబుల్ గుర్రప్పకు ప్రశంస

తిరుమలలో మొన్నటి దినం నల్గొండ కు చెందిన శ్రీవారి భక్తుడికి గుండె నొప్పి రాగా అతనికి CPR చేసి కాపాడిన కానిస్టేబుల్ గుర్రప్ప ను ప్రశంసించి అభినందించిన తిరుమల అడిషనల్ ఎస్పీ.ఈ కార్యక్రమంలో తిరుమల డిఎస్పి మరియు తిరుమల వన్ టౌన్ సిఐ టూటౌన్ సిఐ సదరు సిబ్బంది హాజరైన గుర్రప్పను అభినందించారు.

ఖమ్మం

పలు శుభ కార్యాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి జిల్లాలో ఆదివారం పండుగ వాతావరణం తలపించింది. తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వరుస శుభకార్యాల్లో పాల్గొని ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో ఆదిత్య ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం, గంగమ్మతల్లి ఆలయంలో బోనాల జాతరలో పాల్గొని భక్తులతో కలిసిపోయారు. అనంతరం మల్లేపల్లిలోని బీఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో పురం ఉపేందర్ కుమారుని వివాహం, నేలకొండపల్లి ఏఎంసీ మార్కెట్‌ యార్డులో చిలకల రాములు కుమారుని వివాహం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా జరిగిన పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, రిసెప్షన్లకు హాజరై ఆశీర్వచనాలు అందించారు. వెంకటగిరిక్రాస్ రోడ్‌లోని శ్రీహర్ష కన్వెన్షన్‌, నాయుడుపేట పీవీఆర్ గార్డెన్స్‌, రెడ్డిపల్లి ఏఆర్ గార్డెన్స్‌, సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లలో జరిగిన వివాహ వేడుకల్లో పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు. ఖమ్మం నగరంలోని రామన్నపేట, ఉషాహరి కన్వెన్షన్, సిటీ సెంట్రల్ కన్వెన్షన్, ఎస్ఆర్ కన్వెన్షన్, పుట్టకోటతో పాటు అనేక ప్రాంతాల్లో జరిగిన శుభకార్యాల్లోనూ పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీలో శెట్టిపల్లి వెంకటేశ్వర్లు మనమరాళ్ల ఓణీల అలంకరణ వేడుకలోనూ మమేకమయ్యారు. ప్రతీ చోటా పట్టు వస్త్రాలను కానుకగా అందజేస్తూ.. ఆత్మీయత నిండిన ఆశీస్సులను మంత్రి పొంగులేటి వారికి అందించారు.

ఖమ్మం

ఆర్షిక సహాయం..

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతి నిధి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరావు క్యాంప్ కార్యాలయంలో,కాంగ్రెస్ పార్టీ కార్యలయం లో పని చేస్తున్న లింగమ్మ భర్త కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలుసుకొని వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం చేసిన డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్. వారితో పాటు పాల్గొన్న నగర మేయర్ పునకొల్లు నీరజ సాధు రమేష్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

రాష్ట్ర మహా సభల గోడ పత్రికలు ఆవిష్కరణ

ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఒంగోలు లో జరిగే సిపిఐ పార్టీ రాష్ట్రమహాసభలకు సంబంధించి గోడ పత్రికలను శ్రీకాళహస్తి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.అనంతరం ఆ పార్టీ నాయకుడు చందు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.