పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 19 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్లలోని గీతా నగర్ పాఠశాలలో రోబో టీచర్ తో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు విద్యార్థులకు సాంకేతికత ఆధారంగా బోధన అందిస్తున్న విధానాన్ని తల్లిదండ్రులకు వివరించారు రోబోట్ ద్వారా పాఠాలను ఆసక్తికరంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం శారదా తెలిపారు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు రోబో టీచర్ను ప్రశ్నించగా సమాధానాలు ఇచ్చి సందేహాలను నివృత్తి చేసింది ఇండోస్ ల్యాబ్ అందించిన రోబో టీజీ ప్రభుత్వ పాఠశాలలో తొలి రోబో టీచర్ గా నిలిచింది



