గూడూరు. సెప్టెంబరు 19 ( పున్నమి ప్రతినిధి ) :
నెల్లూరు జిల్లా గూడూరులోని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వఛ్చ ఆంధ్ర
కార్యక్రమం ఘనంగా జరిగింది.శనివారం నాడు ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో
జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత పారిశుధ్యం పై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ఆరోగ్యం మరియు మేధో వికాసం కలుగుతుందని దానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలువురు వక్తలు కోరారు. అనంతరం ప్రిన్సిపాల్ సిబ్బంది కళాశాల పరిసరాలను శుభ్రం చేసారు. విద్యార్థులు తరగతులను ప్రయోగ శాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులు కళాశాల సిబ్బంది స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో కిరణ్మయి, సాసా కో ఆర్డినేటర్ ప్రసాద్, గోవిందు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఎస్.కే.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా స్వర్ణాంధ్ర – స్వచ్చ ఆంధ్ర వేడుకలు
గూడూరు. సెప్టెంబరు 19 ( పున్నమి ప్రతినిధి ) : నెల్లూరు జిల్లా గూడూరులోని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వఛ్చ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది.శనివారం నాడు ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత పారిశుధ్యం పై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ఆరోగ్యం మరియు మేధో వికాసం కలుగుతుందని దానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలువురు వక్తలు కోరారు. అనంతరం ప్రిన్సిపాల్ సిబ్బంది కళాశాల పరిసరాలను శుభ్రం చేసారు. విద్యార్థులు తరగతులను ప్రయోగ శాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులు కళాశాల సిబ్బంది స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో కిరణ్మయి, సాసా కో ఆర్డినేటర్ ప్రసాద్, గోవిందు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

