తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. నల్ల టీషర్టులతో సభకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. నల్ల టీషర్టులతో సభకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

