Monday, 7 September 2026

Tag: #BRS

ఖమ్మం

బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దౌర్జన్యం దారుణం ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రజలు సహించరు: మాజీ ఎంపీ నామ

ఖమ్మం: అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను బలవంతంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. అరెస్టు సందర్భంగా కేటీఆర్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. పోలీసుల తోపులాటలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి స్వల్ప గాయాలు కావడం విచారకరమన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావును తోపులాటలో కిందపడేలా చేయడం శోచనీయమన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి పట్ల వ్యవహరించిన తీరు ఇదేనా అని నామ ప్రశ్నించారు. మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఎమ్మెల్యేలనే లాక్కెళ్లడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నేతలపై పోలీసులు బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అరెస్టులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ నిరసనలు చేస్తే ప్రజాస్వామ్యం, తెలంగాణలో బీఆర్ఎస్ నిరసన చేస్తే అరెస్టులా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు నల్లచొక్కాలు ధరించి వెళ్తే తప్పులేదు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. కాంగ్రెస్‌కు కేంద్రంలో ఒక న్యాయం, తెలంగాణలో మరో న్యాయమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గొంతు నొక్కాలని చూస్తే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని నామ నాగేశ్వరరావు హెచ్చరించారు

తెలంగాణ

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. నల్ల టీషర్టులతో సభకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం

అసెంబ్లీ అరెస్టులపై సత్తుపల్లిలో గులాబీ గర్జన సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ

సత్తుపల్లి / ఖమ్మం తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టులను నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నల్ల కండువాలు, నల్ల జెండాలతో జీవీ మాల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీకి నల్ల టీషర్టులతో వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం, కేటీఆర్, హరీశ్‌రావు తదితర నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని సండ్ర వెంకట వీరయ్య తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను ప్రశ్నించడం ప్రతిపక్ష హక్కని, ప్రశ్నించే గొంతును అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల వ్యవహారశైలిపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని సండ్ర డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2,500, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌లో తులం బంగారం వంటి హామీలు అమలు చేయాలని కోరారు. అనంతరం ప్రజల నుంచి సేకరించిన సమస్యలపై వినతిపత్రాలను ప్రజావాణిలో అధికారులకు సండ్ర వెంకట వీరయ్య సమర్పించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.