ఖమ్మం జూన్
(పున్నమి జిల్లా ప్రతి నిధి )
ఖమ్మం నగరంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసి భవనం పై నుంచి కిందకు తోసిన ఘటనలో నిందితుడు ఎం.డి. గౌస్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఖమ్మం 2వ పట్టణ పోలీసులు హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. సేకరించిన ఆధారాల ఆధారంగా నిందితుడు ఎం.డి. గౌస్ (57), కార్ డ్రైవర్ను కేసు నమోదు అయిన 24 గంటల్లోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీపీ రమణమూర్తి తెలిపారు. బాధితురాలి వివరాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


