Friday, 4 September 2026
  • Home  
  • 65 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
- అనంతపురం

65 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రపంచంలో ఉపాధ్యాయ వృత్తిని మించిన గొప్ప వృత్తి మరొకటి లేదని అనంతపురం ఎంపీ అంబికా జి. లక్ష్మీనారాయణ అన్నారు. ఎస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్‌లో గురుపూజోత్సవం నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి అతిథులు పుష్పాంజలి ఘటించారు. విద్యార్థులకు విద్యతోపాటు జీవితానికి సరైన మార్గాన్ని చూపే గురువుల సేవలు అమూల్యమని ఎంపీ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉత్తమ సేవలందిస్తున్న 65 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డా. పతిక రమేష్ నారాయణ, డా. పి. పద్మశ్రీ, బిసాటి భరత్, సుంకర రమేష్, డా. గీతా బాల, డా. గజ్జల లక్ష్మణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రపంచంలో ఉపాధ్యాయ వృత్తిని మించిన గొప్ప వృత్తి మరొకటి లేదని అనంతపురం ఎంపీ అంబికా జి. లక్ష్మీనారాయణ అన్నారు. ఎస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్‌లో గురుపూజోత్సవం నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి అతిథులు పుష్పాంజలి ఘటించారు. విద్యార్థులకు విద్యతోపాటు జీవితానికి సరైన మార్గాన్ని చూపే గురువుల సేవలు అమూల్యమని ఎంపీ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉత్తమ సేవలందిస్తున్న 65 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డా. పతిక రమేష్ నారాయణ, డా. పి. పద్మశ్రీ, బిసాటి భరత్, సుంకర రమేష్, డా. గీతా బాల, డా. గజ్జల లక్ష్మణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.