డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలులో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజోలు సాయిబాబా గుడి సమీపంలో జనసేన నాయకుడు చింతా ప్రసాద్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు సురిశెట్టి శ్రీనివాసరావు, గ్రామ శాఖ అధ్యక్షులు కాట్నా రాజు, గుండుబోగుల పెద్దకాపు, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, మల్లిపూడి సత్తిబాబు, దార్ల కుమారి లక్ష్మి, అకాని బాబ్జి, సత్తిరాజు స్వామి, అడబాల విజయ్, బొమ్మిడి మహేష్, కోళ్ల బాబి, గొల్లమందల పూర్ణబాస్కర్ రావు, దారపురెడ్డి బాబ్జి, నామన షణ్ముఖ్, బారం రాజా, రేఖపల్లి శ్రీను, కోళ్ల బద్రి తదితరులు పాల్గొన్నారు.



