నంద్యాల :ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా స్వీకరించే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని, అవి మళ్లీ ‘రీఓపెన్’ కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పిజిఆర్ఎస్ అనంతరం అధికారులతో ఆమె ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన 5,513 రీఓపెన్ అర్జీలలో ఇప్పటికే 5,444 అర్జీలను పరిష్కరించామని, మిగిలిన 69 దరఖాస్తులను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లోనే రీఓపెన్ అర్జీలు ఎక్కువగా ఉన్నందున ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 137 భూ సమస్యల అర్జీలు రాగా, సోమవారం పిజిఆర్ఎస్లో మొత్తం 272 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రామునాయక్, నోడల్ అధికారి ఉమామహేశ్వరి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల కలెక్టరేట్లో PGRS సమీక్ష: ‘రీఓపెన్’ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం
నంద్యాల :ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా స్వీకరించే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని, అవి మళ్లీ ‘రీఓపెన్’ కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పిజిఆర్ఎస్ అనంతరం అధికారులతో ఆమె ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన 5,513 రీఓపెన్ అర్జీలలో ఇప్పటికే 5,444 అర్జీలను పరిష్కరించామని, మిగిలిన 69 దరఖాస్తులను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లోనే రీఓపెన్ అర్జీలు ఎక్కువగా ఉన్నందున ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 137 భూ సమస్యల అర్జీలు రాగా, సోమవారం పిజిఆర్ఎస్లో మొత్తం 272 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రామునాయక్, నోడల్ అధికారి ఉమామహేశ్వరి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

