నంద్యాల జిల్లాలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీని బలోపేతం చేయడంతో పాటు రక్త నిల్వలను పెంచేందుకు ఉద్యోగులంతా జీవితకాల సభ్యత్వం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. రూ.1,000 చెల్లించి జీవితకాల సభ్యులుగా చేరవచ్చని తెలిపారు.ఇప్పటికే జిల్లా పరిషత్కు చెందిన 30 మంది సిబ్బంది సభ్యత్వం తీసుకొని రూ.33 వేలు అందించారని, గతంలో 56 మంది సభ్యత్వం ద్వారా రూ.61,600 సమకూరినట్లు చెప్పారు. రెడ్క్రాస్ సభ్యులకు తక్కువ ధరకే రక్తం అందించడంతో పాటు సీపీఆర్ వంటి అత్యవసర సేవల్లో శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందించేందుకు రూ.2 కోట్లతో ‘అంబులెన్స్ ఆసుపత్రి’ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. అధికారులు చొరవ తీసుకుని యూత్, జూనియర్ రెడ్క్రాస్ ద్వారా యువ రక్తాన్ని ప్రోత్సహించి సభ్యత్వాలను పెంచాలని కలెక్టర్ సూచించారు.

రెడ్క్రాస్ సభ్యత్వం తీసుకోండి: ఉద్యోగులకు నంద్యాల కలెక్టర్ పిలుపు
నంద్యాల జిల్లాలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీని బలోపేతం చేయడంతో పాటు రక్త నిల్వలను పెంచేందుకు ఉద్యోగులంతా జీవితకాల సభ్యత్వం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. రూ.1,000 చెల్లించి జీవితకాల సభ్యులుగా చేరవచ్చని తెలిపారు.ఇప్పటికే జిల్లా పరిషత్కు చెందిన 30 మంది సిబ్బంది సభ్యత్వం తీసుకొని రూ.33 వేలు అందించారని, గతంలో 56 మంది సభ్యత్వం ద్వారా రూ.61,600 సమకూరినట్లు చెప్పారు. రెడ్క్రాస్ సభ్యులకు తక్కువ ధరకే రక్తం అందించడంతో పాటు సీపీఆర్ వంటి అత్యవసర సేవల్లో శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందించేందుకు రూ.2 కోట్లతో ‘అంబులెన్స్ ఆసుపత్రి’ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. అధికారులు చొరవ తీసుకుని యూత్, జూనియర్ రెడ్క్రాస్ ద్వారా యువ రక్తాన్ని ప్రోత్సహించి సభ్యత్వాలను పెంచాలని కలెక్టర్ సూచించారు.

