నంద్యాల :ఈ నెల 23న స్థానిక ఎస్పీజీ గ్రౌండ్స్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో క్రాంతినగర్లోని శ్రీ శాంతినికేతన్ పాఠశాల పదో తరగతి విద్యార్థులు సి. అరవింద్, కె. అజయ్ కుమార్ రెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపికయ్యారు.శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో జరగనున్న “8వ సీనియర్ మెన్ & ఉమెన్ స్టేట్ లెవల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బేస్బాల్ ఛాంపియన్షిప్ – 2026″లో వీరు నంద్యాల జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన పీఈటీ మాస్టర్లను పాఠశాల చైర్మన్ సుధాకర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలకు శాంతినికేతన్ విద్యార్థుల ఎంపిక
నంద్యాల :ఈ నెల 23న స్థానిక ఎస్పీజీ గ్రౌండ్స్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో క్రాంతినగర్లోని శ్రీ శాంతినికేతన్ పాఠశాల పదో తరగతి విద్యార్థులు సి. అరవింద్, కె. అజయ్ కుమార్ రెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపికయ్యారు.శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో జరగనున్న “8వ సీనియర్ మెన్ & ఉమెన్ స్టేట్ లెవల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బేస్బాల్ ఛాంపియన్షిప్ – 2026″లో వీరు నంద్యాల జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన పీఈటీ మాస్టర్లను పాఠశాల చైర్మన్ సుధాకర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

