విశాఖ: 88వ వార్డు నరవ గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగింది.
వీర మహిళలు జనసేన లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఏడు సిద్ధాంతాలతో పార్టీని స్థాపించారని, ఎన్డీఏ కూటమితో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశాలతో గ్రామ బాధ్యతలు లింగం శ్రీనివాసరావుకు అప్పగించారు.
గ్రామంలో కల్యాణ మండపం, రోడ్లు, 10 పడకల ఆసుపత్రి, బీసీ గురుకుల భవనం వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో 200 మంది జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


