జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు బాధ్యతాయుత పర్యాటకంపై చర్చించేందుకు ఈనెల 24న అరకులోయ లోని పున్నమి అతిథిగృహాంలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పట్టాసీ చలపతిరావు తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి హోటల్, రెస్టారెంట్ యజమానులు, ట్రావెల్ ఏజెన్సీలు విధిగా హాజరుకావాలన్నారు. ఏపీటీడీసీ, ఐటీడీఏ పర్యాటక శాఖ, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నారు. ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనల అమలు, పర్యాటక సేవల మెరుగుదల, శాఖల మధ్య సమన్వయం, పర్యాటకుల భద్రత తదితర అంశాలపై చర్చించనున్నారు.

అరకు: ఈ నెల 24న హోటల్, రెస్టారెంట్ యజమానులతో సమావేశం
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు బాధ్యతాయుత పర్యాటకంపై చర్చించేందుకు ఈనెల 24న అరకులోయ లోని పున్నమి అతిథిగృహాంలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పట్టాసీ చలపతిరావు తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి హోటల్, రెస్టారెంట్ యజమానులు, ట్రావెల్ ఏజెన్సీలు విధిగా హాజరుకావాలన్నారు. ఏపీటీడీసీ, ఐటీడీఏ పర్యాటక శాఖ, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నారు. ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనల అమలు, పర్యాటక సేవల మెరుగుదల, శాఖల మధ్య సమన్వయం, పర్యాటకుల భద్రత తదితర అంశాలపై చర్చించనున్నారు.

