మృత్యుంజయ కుంటలో మహిళలకు వాయినాలు
కడప, ఆగస్టు 21: పున్నమి ప్రతినిధి: కడప నగరంలోని మృత్యుంజయ కుంట ప్రాంతంలో మహిళలందరూ కలిసి మహేశ్వరి ఆధ్వర్యంలో మహిళలకు వాయినాలు అందజేశారు. మహిళలంతా ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దీపిక, సునీత, శైలజ, సుచిత్ర, లక్ష్మి, హాసిని, ఊహాసిని, మైత్రి, జీవన, భావన శ్రీ,సంధ్య తదితరులు పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా వాయినాలు అందించుకుంటూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.





