పాత్రికేయులపై దాడులు సహించేది లేదు: ఏపీయూడబ్ల్యూజే
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వార్త రాసిన విశాలాంధ్ర విలేకరి గోవిందుపై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి ఏవోకు వినతిపత్రం అందజేశారు. విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు.


